HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ttd Send 1 Lakh Laddus To Ayodhya Ram Temple

TTD: అయోధ్య రాములోరికి తిరుమల శ్రీవారి లడ్డూలు

  • Author : Balu J Date : 19-01-2024 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ayodhya Ram Mandir Updates work completing soon
Ayodhya Ram Mandir Updates work completing soon

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష శ్రీవారి లడ్డూలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు లడ్డూలను ప్యాకింగ్ చేసే పనిలో 350 మంది కార్మికులు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. 350 బాక్సుల్లో ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో బాక్సులో 150 ప్యాకెట్ల లడ్డూలు ఉంటాయని, ఒక్కోటి 25 గ్రాముల బరువుంటాయని తెలిపారు. “శ్రీరాముని భక్తులకు ఈ పవిత్రమైన నైవేద్యాల యొక్క సహజమైన నాణ్యతను నిర్ధారించడానికి” ప్యాకింగ్ ప్రక్రియలో వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని TTD మూలం తెలిపింది. జనవరి 20న తిరుమల నుంచి లక్ష లడ్డూలను పంపించాలని టీటీడీ నిర్ణయించింది.

త్వరలో రామ మందిరం ప్రారంభోత్సవ ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనున్నారు. సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లను జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి బయల్దేరే అయోధ్య రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఇక ఆలయ ప్రతిష్టాపన జరిగాక అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు అయోధ్య ఆహ్వానం అందుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • ayodhya
  • laddu
  • ttd board

Related News

    Latest News

    • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

    • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

    • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

    • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

    • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd