HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Changing Contours Of Simhachala Field And Other Development Works

Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!

  • Author : Vamsi Chowdary Korata Date : 27-11-2025 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Simhachalam Temple
Simhachalam Temple

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరిగింది. నాల్కో సంస్థ సీఎస్ఆర్ కింద్ ఇచ్చిన రూ. 1.58 కోట్ల నిధులతో చేపట్టిన షెడ్లకు శంఖుస్థాపన చేశారు. ఇక కోల్‌కతాకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన రూ. 45 లక్షల విరాళంతో తొలిపావంచా వద్ద నిర్మించనున్న షెడ్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 3 కోట్లతో నిర్మించిన టీఎంఎస్‌ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సింహాచల ఆలయ ప్రక్షాళన చేసి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు.

రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం వెలుగొందుతోంది. విశాఖపట్నం జిల్లాలో కొలువై ఉన్న సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆయితే ప్రస్తుతం ఈ ప్రసిద్ధ ఆలయం రూపురేఖలు మారుతున్నాయి. భక్తులు ఇచ్చిన విరాళాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్‌ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి.. రూ.3 కోట్లు వెచ్చించి సింహగిరిపై టీఎంఎస్‌ (టెన్సిల్‌ మెంబ్రేన్‌ షెల్టర్‌) షెడ్డు నిర్మించారు.

కాగా, ఈ టీఎంఎస్‌ షెడ్డు ప్రారంభోత్సవం బుధవారం (నవంబర్ 26న) సింహగిరిపై జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి గణబాబు పాల్గొన్నారు. టీఎంఎస్ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. కేవలం వంద రోజుల వ్యవధిలో.. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్పారు. దాతలకు, గుత్తేదారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

ఈ షెడ్డు ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సింహాచలం దేవస్థానంలో వైసీపీ పాలనలోని అవశేషాలను తొలగిస్తామన్నారు. గత ప్రభుత్వంలోని కొందరు సింహాచల క్షేత్రాన్ని వివాదాలకు చిరునామాగా మార్చారని.. తాము ఈ దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు. అంతేకాకుండా గత కొన్నాళ్లుగా స్వామివారి ఆభరణాల లెక్కల్లో తేడాలు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగుల వ్యవహారాలు, తదితర ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రసాద్‌ పథకం పనులు త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

సింహాచల కొండపై విరాళాలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. అందులో లోవతోటలో రూ. 98 లక్షలతో, ఆలయ ప్రాకారం చుట్టూ రూ. 60 లక్షలతో.. నాల్కో సంస్థ కార్పొరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులతో చేపట్టిన షెడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. దాంతో పాటు కోల్‌కతాకు చెందిన దాత ఇచ్చిన విరాళంతో కొండ దిగువన తొలిపావంచా దగ్గర రూ. 45 లక్షలతో నిర్మించతలపెట్టిన షెడ్లకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మేయర్‌ పీలా శ్రీనివాసరావు తదితరులు శంకుస్థాపన చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Donations Of Devotees
  • Redevelopment
  • Simhachalam temple
  • Visakhapatnam

Related News

Infosys In Visakhapatnam

విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

Infosys : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd