HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Alliance Wins A Landslide Victory In The Mlc Elections

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం

MLC Elections : అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ప్రజలు మళ్లీ అదే కూటమికి విశేషమైన మద్దతు తెలుపడంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి

  • Author : Sudheer Date : 04-03-2025 - 6:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Nda Alliance Mlc
Ap Nda Alliance Mlc

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ప్రజలు మళ్లీ అదే కూటమికి విశేషమైన మద్దతు తెలుపడంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. రెండు స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీతో గెలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Ravindra Jadeja: ర‌వీంద్ర జ‌డేజాను బౌలింగ్ చేయ‌కుండా అడ్డుకున్న అంపైర్లు.. కార‌ణ‌మిదే?

కృష్ణా-గుంటూరు ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు సాధించి, 67.51% ఓటు శాతంతో 82,320 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు 1,24,702 ఓట్లు పొంది, 62.59% ఓటు శాతం సాధించి 77,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కూటమికి 58% ఓటు శాతం వచ్చినప్పటికీ, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది 65%కు పెరగడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ పూర్తిగా వెనుకబడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే ధైర్యం కూడా వైసీపీ కనబరచలేకపోవడం, మద్దతు ఇచ్చిన అభ్యర్థులు తీవ్ర ఓటమిని ఎదుర్కోవడం పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి మూడవ స్థానంలో నిలిచారు. అలాగే వైసీపీ మద్దతు ప్రకటించిన తర్వాత పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మరింత నష్టపోయారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటుతో ప్రభుత్వ పనితీరును ఆశీర్వదించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ

8 నెలల కూటమి పాలనపై ప్రజలు మరింత నమ్మకం పెంచుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో 57% ఓటు షేర్‌తో ప్రభుత్వం ఏర్పాటయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65% పైగా ఓటు షేర్ నమోదు కావడం చంద్రబాబు ప్రభుత్వం పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే దానికి నిదర్శనం. మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 స్థానాలు గెలుచుకున్న కూటమి, ఇప్పుడు మరో రెండు స్థానాలను గెలుచుకొని విజయాన్ని మరింత ఘనతతో నిలబెట్టుకోవడం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP MLC
  • AP NDA alliance
  • mlc elections

Related News

Nagababu

Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

Nagababu : ఐదు, ఆరు ఏళ్ల తర్వాత రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, తన దృష్టిలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

  • Tamil Nadu

    Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి

Latest News

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd