Nellore TDP vs YCP : కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి
కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా పౌర
- By Prasad Published Date - 07:24 AM, Sun - 16 October 22
కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో జిల్లా మంత్రి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మంత్రులకు వాటా లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లలో ఆ శాఖను పర్యవేక్షించే నలుగురు జేసీలను మార్చేయడం కూడా కుంభకోణంలో భాగమేనని సోమిరెడ్డి ఆరోపించారు. జిల్లా మంత్రి ఆశీస్సులతోనే కృష్ణపట్నం ఓడరేవు మీదుగా రేషన్ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని.. ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రతినిధులకు ఆర్బీకేల కేంద్రంగా జరుగుతున్న అవినీతిని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. రైతుల కోసమే బతుకుతున్నాం…ప్రతి గింజా కొంటామని జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి సమీక్షలు పెట్టడం కాదని..ఈ కుంభకోణాల గురించి తేల్చండని ఆయన డిమాండ్ చేశారు. క్రైమ్ కమ్ కరెప్షన్ కేపిటల్ గా నెల్లూరును నాలుగో రాజధానిగా ప్రకటిస్తారేమోనని ఆయన అన్నారు. నెల్లూరు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో రెండున్నరేళ్లలో రూ. 29.78 కోట్లు కుంభకోణం జరిగిందని ఉన్నతాధికారులే తేల్చారని.. ప్రతి నెలా కోట్లకు కోట్లు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నా జిల్లా మంత్రి కానీ, ఇంఛార్జ్ మంత్రి కానీ, పౌరసరఫరాల శాఖ మంత్రి కానీ నోరుతెరవకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. చినచిన్నోళ్లను 11 మందిని సస్పెండ్ చేసి, కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని.. ఈ రూ.29.78 కోట్లలో మెజార్టీ వాటా జిల్లాకు చెందిన ఓ పెద్దమనిషికి చేరిందని తెలుస్తోందన్నారు. జిల్లా మంత్రికి మేజర్ వాటా ఉందని తెలియడంతో ఇంఛార్జ్ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు. రెండున్నరేళ్లుగా మిల్లింగ్ చార్జీలు రూ.240 కోట్లు, ఈ క్రాఫ్ బుకింగ్ లో ఫ్రాడ్ జరిగిందని రైతులకు రూ.100 కోట్లు చెల్లించకుండా ఆపేశారన్నారు. పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన కమిషన్ రూ.5 కోట్లు, హమాలీలకు రూ.10 కోట్లు చెల్లించలేదని సోమిరెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం విషయంలోనూ భారీ కుంభకోణం జరుగుతోందని…లబ్ధిదారుల వద్ద కిలో రూ.10కి బియ్యం కొనుగోలు చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలించి వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టులోనూ జిల్లాలోని పెద్దమనిషి దందా సాగుతోందని..ముత్తుకూరు, వెంకటాచలం, కృష్ణపట్నం పోలీసులకు చేతులు తడిపి ఆ పెద్దమనిషి ఆశీర్వాదం తీసుకుని బియ్యాన్ని ఓడల్లోకి ఎక్కిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో వందల కోట్ల కుంభకోణాలు, అక్రమాలు జరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Tags
Related News
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి