TDP : అధికారం కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతుంది – టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఓటర్ లిస్టుల్లో అనేక అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి
- By Prasad Published Date - 05:09 PM, Tue - 24 October 23
వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఓటర్ లిస్టుల్లో అనేక అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వపు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనపై ప్రజలు విసిగి పోయారని.. సామాన్య ప్రజలు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఓటు వేయరో వారిని ఓటర్ లిస్టు నుండి వారి పేర్లను తొలగించడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అందుకు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థలోని వాలంటీర్లను వాడుకుంటోందన్నారు. వ్యతిరేకుల ఓట్లు తొలగించేందుకు కుంటి సాకులు చూపుతున్నారని.. పేర్లు తొలగించేందుకు ఉపయోగించే ఫామ్ 7ని బల్క్ గా అప్ లోడ్ చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల బీఎల్ ఓలను బెదిరించి ఓట్లు తొలగిస్తున్నారని.. కొందరు అధకారులను భయపెట్టడం, బెదిరించడం లేక పోస్టింగులు ఇస్తామని ఆశ చూపడం జరుగుతోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయిన రోజు నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లను తొలగించే పని అధికమైందన్నారు. ప్రస్తుతం ఓటర్ లిస్టు సవరణలు జరుగుతున్నాయని.. ఇందులో ఇప్పటి వరకు 7 లక్షల 60వేల ఫామ్ 7 లు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తే కేవలం చంద్రబాబునాయుడుగారు అరెస్టు అయినప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 8 నుంచి 15వ తేది వరకు అంటే వారం రోజుల్లో 2 లక్షల 44 వేల 551 ఫామ్ 7 లను వీరు అప్ లోడ్ చేశారన్నారు. చంద్రబాబు ను అరెస్టు చేశారని రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తుంటే ఆ సమయంలో అధికారులను అడ్డం పెట్టుకొని 2 లక్షల 44 వేల మంది ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ నాలుగు నెలల్లో కొత్త ఓట్ల ఎన్ రోల్ మెంట్ లో సుమారు 6 లక్షల 80 వేల ఓట్లు నమోదు చేసుకోవడానికి అప్లై చేస్తే కేవలం చంద్రబాబు అరెస్టు అయిన వారంలో లక్షా 20 వేల 44 ఓట్లు కొత్తగా ఎన్ రోల్ చేశారన్నారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసివేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అనుమానం ఉన్న వారి ఓట్లు తీసివేయటం జరిగిందన్నారు.
Also Read: IKEA : బ్యాగ్కు రూ.20 వసూలు చేసిన ఐకియా.. షాక్ ఇచ్చిన వినియోగదారుల కోర్టు
Related News
TDP Tweet: కూటమిదే విజయమా..? వైరల్ అవుతున్న టీడీపీ ట్వీట్
ఏపీలో మే 13వ తేదీన అంటే సోమవారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.