TDP Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
వైసీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ లేఖ(TDP Complaint) రాశారు.
- By Gopichand Published Date - 04:44 PM, Wed - 27 March 24
TDP Complaint: వైసీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ లేఖ(TDP Complaint) రాశారు. వైసీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కనకమెడల రవీంద్ర కుమార్ కోరారు. వైసీపీ లోగోలు, గుర్తులు, ఫోటోలతో కూడిన బహుమతులను ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు పంపిణీ చేయటానికి తిరుపతిలోని పలు గోడౌన్లలో భారీగా డంప్ చేసినట్లు లేఖలో ప్రస్తావించారు. వైసీపీ నాయకుల ఫోటోలతో కూడిన వాచీలు, చీరలు, గ్రైండర్లు, టీ షర్టులు, కుక్కర్లు, స్పీకర్లు, సెల్ఫోన్లు, గొడుగులు అనేక బహుమతులను కూడిన భారీ సామాగ్రిని టీడీపీ కార్యకర్తలు గుర్తించారని అన్నారు.
శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని రేణిగుంట మండలం ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని పాత ఎఫ్సీఐ గోడౌన్లో ఈ వస్తువులు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. 2024 మార్చి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టిడిపి కార్యకర్తలు ఈ డంప్ను పట్టుకున్నారు. దానిపై సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత ఎన్నికల అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదన్నారు.
26/03/2024న సాయంత్రం 4.03 నిమిషాలకు CEO, AP జిల్లా ఎన్నికల అధికారి, తిరుపతి జిల్లాకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని తెలిపారు. C-Vigil యాప్ ద్వారా 26/3/2024 రాత్రి 9.25 గంటలకు ID:822869, 824951తో రెండుసార్లు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్, స్థానిక ఎన్నికల అధికారిని సంప్రదించారని తెలిపారు. కానీ వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదన్నారు.
Also Read: Insurance Policy : ఏప్రిల్ 1 విడుదల.. ‘బీమా పాలసీ సరెండర్’ కొత్త రూల్స్
అధికారుల అండతో స్టాక్ను అక్కడి నుంచి ఎత్తివేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు గత రాత్రంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆవరణలో కాపలా కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడానికి భారీ మొత్తంలో ‘ఎన్నికల కానుకలు’ నిల్వ చేయబడే ఇలాంటి గోడౌన్లు తిరుపతి పట్టణం, చుట్టుపక్కల చాలా ఉన్నాయని మేము నమ్ముతున్నామన్నారు. రాష్ట్ర పరిపాలన, MCC కాలంలో ECI నియంత్రణలో పనిచేస్తున్నప్పటికీ ఇంత భారీ ఎన్నికల మోసాల పట్ల ఉదాసీనంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని లేఖలో కనకమేడల పేర్కొన్నారు. మొత్తం మెటీరియల్ని స్వాధీనం చేసుకోవడానికి స్టాక్లపై నిఘా ఉంచడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అటువంటి ఇతర నిల్వల కోసం తనిఖీ లేదా చుట్టుపక్కల పట్టణాలు/గ్రామాలు సి) ఆ మెటీరియల్ కొనుగోలుదారుల వివరాలపై ఆరా తీయాలన్నారు. మోడల్ ఉల్లంఘనలకు IPC, RP చట్టం కింద క్రిమినల్ కేసులను బుక్ చేయాలన్నారు. కోడ్, ఎన్నికల అధికారులు సకాలంలో పని చేయడంలో వైఫల్యానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
Related News
Bk Parthasarathi: టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం డ్యామేజ్
హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది.