HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Puts Daggubati Venkateswara Rao In Dilemma

Daggubati : చంద్ర‌బాబు చాణక్యంతో `ద‌గ్గుబాటి` డైల‌మా

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబునాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబాలు ఒక‌ట‌వుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

  • Author : CS Rao Date : 16-09-2022 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu-Daggubati
Babu Daggubati

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబునాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబాలు ఒక‌ట‌వుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు ద‌గ్గుబాటి హితేష్ చెంచురామ్ కు ప‌ర్చూరు టీడీపీ టిక్కెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదే జ‌రిగితే, ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావు ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్ప‌న్నం అయింది. కానీ, తాజాగా సిట్టింగ్ లు అంద‌రికీ చంద్ర‌బాబు టిక్కెట్ల‌ను ఖ‌రారు చేయ‌డంతో పాటు సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చే ధైర్యం ఉందా? అంటూ జ‌గ‌న్ కు స‌వాల్ విసిరారు.

వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ల‌లో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మద్దాల‌గిరి, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ పంచ‌న ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా టీడీపీకి అట్టీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. ఆ న‌లుగురు కాకుండా ఇంకా 19 మంది మాత్ర‌మే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ల‌కు టిక్కెట్లను ఖ‌రారు చేస్తూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఆ నలుగురి ప‌రిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా ఉంది.

సిట్టింగ్ ల‌కు 2024 ఎన్నికల్లో టిక్కెట్ల‌ను వెల్ల‌డిస్తూ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం ద‌గ్గుబాటి కుటుంబాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌ట‌. అంతే కాకుండా రెబ‌ల్ ఎమ్మెల్యేల బ‌దులుగా ఎవ‌రి అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేస్తారు? అనే చర్చ మొద‌ల‌యింది. పొత్తులతో సంబంధం లేకుండా సిట్టింగ్ ల‌కు టిక్కెట్ల‌ను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఒంట‌రిగా 2024 ఎన్నిక‌ల‌కు వెళుతున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. మొత్తం మీద చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం సొంత పార్టీ వాళ్ల‌నే కాకుండా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను కూడా ఆలోచింప చేస్తోంది.

ఒక వేళ చంద్ర‌బాబు పొత్తుల‌కు వెళితే ఎవరికి ఏ సీటు అన్నది ఇప్పుడే చెప్ప‌లేం. కానీ దూకుడుగా ముందే అభ్యర్థులను బాబు ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరికొందరికి కూడా టికెట్ కన్ఫాం చేశారు. దీంతో ఒంటరి పోరాటం చేయ‌డానికి టీడీపీ సిద్ధం అవుతుంద‌న్న సంకేతం బ‌లంగా వెళుతోంది. దాదాపు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 35కి పైగా అభ్యర్థులను ఖరారు చేసిన‌ట్టు పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సిట్టింగ్ ల‌తో పాటు మరో 15 మంది అభ్యర్థులను చంద్రబాబు ఇప్పటికే ఫైనల్ చేశారు.
ఆ జాబితాలో
1 అవ‌నిగ‌డ్డ: మండలి బుద్ధ‌ప్ర‌సాద్ 2.పెన‌మ‌లూరు: బోడే ప్ర‌సాద్ 3.సంత‌నూత‌ల‌పాడు: విజ‌య్‌కుమార్ 4.మార్కాపురం: కందుల నారాయ‌ణ‌రెడ్డి 5.రాజంపేట: బ‌త్యాల చెంగ‌ల్రాయుడు 6.ఒంగోలు: దామ‌చ‌ర్ల జానార్థ‌న్ 7.మైదుకూరు: పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ 8.ఆళ్ల‌గ‌డ్డ: భూమా అఖిల ప్రియ 9.పుంగ‌నూరు: చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి 10.గుంటూరు తూర్పు: మ‌హ్మ‌ద్ న‌జీర్ 11.పీలేరు: నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి 12.పులివెందుల: బీటెక్ రవి 13.డోన్: ధర్మవరం సుబ్బారెడ్డి 14.ఆముదాలవలస: కూన రవికుమార్ 15. ముమ్ముడివరం: ఎమ్మెల్యే దాట్ల బాపిరాజు ఉన్నారు.
టీడీపీ చీఫ్ తాజా ప్ర‌క‌ట‌న త‌రువాత ఒంట‌రిపోరాటంతో పాటు గెలిచేవాళ్ల‌కు ముందుగా స్ప‌ష్ట‌త ఇచ్చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద ద‌గ్గుబాటి టీడీపీ వైపు చూస్తున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి చంద్ర‌బాబు చెక్ పెట్టినట్టు క‌నిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • daggubati venkateswara rao
  • TDP chandrababu naidu
  • telugu desam party

Related News

Arava Sridhar Janasena Mla

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

JanaSena Party  ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్ట

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • 3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

    నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

Latest News

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

  • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd