HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Plans To Finalise Candidates For Upcoming Elecions By Ugadi

Chandrababu Naidu : వంద‌కు త‌గ్గేదెలే.!

ఉగాది నాటికి 100 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు భావిస్తున్నారు.

  • Author : CS Rao Date : 23-02-2022 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఉగాది నాటికి 100 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు భావిస్తున్నారు. ఆ మేర‌కు తొలుత ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలుగా ఉన్న వాళ్ల‌ పేర్ల‌ను దాదాపుగా ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. స‌మ‌న్వ‌య క‌మిటీలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలకు అభ్య‌ర్థిత్వాల‌ను కొంత టైం తీసుకుని ప్ర‌క‌టించాల‌ని యోచిస్తున్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలుగా ఉన్న వాళ్ల‌లో కొంద‌రు అల‌స‌త్వం వ‌హిస్తున్నారని స‌ర్వేల సారాంశం. అలాంటి వాళ్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టాల‌ని బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నాడని తెలిసింది.ప‌లు మార్గాల ద్వారా తెలుగుదేశం పార్టీ స‌ర్వేల‌ను చేయిస్తోంది. తాజాగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా సునీల్ ను నియ‌మించిన బాబు ఆయ‌న ద్వారా ప‌క్కా స‌ర్వేల‌ను ఆశిస్తున్నాడు. పార్టీ కేంద్ర కార్యాల‌యం ఇచ్చిన రిపోర్టు, లోకేష్ టీం చేస్తోన్న స‌ర్వేలు, సునీల్ చేసే స‌ర్వేల‌ను క్రోడీక‌రించి తుది అభిప్రాయానికి బాబు రానున్నాడట‌. ఆ మేర‌కు మాత్ర‌మే ఈసారి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే లోక్ స‌భ అభ్య‌ర్థుల విష‌యంలో ఒక క్లారిటీతో ఉన్న బాబు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. ఉగాది నాటికి తొలి విడ‌త కనీసం 100 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

ఉగాది త‌రువాత చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఆ లోపు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని ప‌క్కా స్కెచ్ తో బాబు ఉన్నాడ‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. సాధార‌ణంగా చంద్ర‌బాబు ఎప్పుడూ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంలో వెనుక‌డుగు వేస్తుంటారు. గ‌త ఎన్నికల్లో ముందుగా ప్ర‌క‌టించ‌డానికి బ‌దులుగా నామినేష‌న్ల చివ‌రి రోజుల్లో వెల్ల‌డించిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. చివ‌రి నిమిషంలో త‌డ‌బాటు కార‌ణంగా ప‌లు ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోయిన దాఖ‌లాలు లేక‌పోలేదు. ఈసారి అందుకు భిన్నంగా ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు వాళ్ల‌కు టాస్క్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌.ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీసం ముగ్గుర్ని అభ్య‌ర్థిత్వం కోసం ప్ర‌మోట్‌ చేసే సంస్కృతి చంద్ర‌బాబు హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగింది. ఆ క్ర‌మంలో మిగిలిన ఇద్ద‌రు ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం చాలా చోట్ల జ‌రిగింది. ఆ విధంగా 2004, 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ జ‌రిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కూడా పోటీగా కొంద‌రు లీడ‌ర్ల‌ను ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌మోట్ చేసిన ప‌రిస్థితుల‌ను చూశాం. ఈసారి అందుకు భిన్నంగా ప్ర‌తి నియోజ‌వ‌ర్గంలోనూ ఏక నాయ‌క‌త్వాన్ని ఉంచాల‌ని స్కెచ్ వేస్తున్నాడు. అందుకే, ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా అసంతృప్తి వాదుల‌ను బుజ్జ‌గించుకునే స‌మ‌యం ఉంటుంద‌ని బాబు అంచ‌నా వేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి బీటెక్ ర‌విని రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థిగా ముంద‌స్తుగా ప్ర‌క‌టించాడు.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో స‌తీష్ రెడ్డి పోటీ చేశాడు. గ‌తంలోనూ ప‌లుమార్లు పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌తీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌విని టీడీపి ఇచ్చింది. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి ముగిసిన త‌రువాత సైలెంట్ గా ఉన్నాడు. సామాజిక కార్య‌క్ర‌మాల‌ను చురుగ్గా చేసే నాయ‌కునిగా స‌తీష్ రెడ్డికి పేరుంది. అందుకే, ఈసారి కూడా ఆయ‌న‌కే పులివెందుల టిక్కెట్ వ‌స్తుంద‌ని ఒక వ‌ర్గం ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. దీంతో ఇంచార్జిగా ఉన్న బీటెక్ రవికి ఇబ్బందిగా మారింది. బ‌హు నాయ‌క‌త్వం దిశ‌గా రాజ‌కీయాలు వెళుతున్నాయ‌ని బాబు గ్ర‌హించాడు. దానికి చెక్ పెట్టేలా పులివెందుల అభ్య‌ర్థిత్వాన్ని బీటెక్ ర‌వికి అప్ప‌గించాడు. ఇలాంటి నిర్ణ‌యాలు రాబోవు రోజుల్లో పలు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉంటాయ‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం భావిస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కుగానూ క‌నీసం 100 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు మిగిలిన వాటిని కూడా స‌ర్వేల ఆధారంగా ఫైన‌ల్ చేయాల‌ని బాబు దూకుడుగా వెళుతున్నాడ‌ని టాక్‌. ఒక వేళ పొత్తు కుదిరితే..జ‌నసేన‌, వామ‌ప‌క్షాల‌కు అత్య‌ధికంగా 25 నుంచి 30 స్థానాల‌కు మించి ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం 175 స్థానాల‌కుగాను 30 పోగా మిగిలిన స్థానాల‌కు రెండు విడ‌త‌లుగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని బాబు యోచిస్తున్నార‌ని స‌మాచారం. తొలి విడ‌త 100 మ‌లివిడ‌త 40 నుంచి 50 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేయాల‌ని స్కెచ్ వేశార‌ట‌. ఉగాది త‌రువాత చంద్ర‌బాబు వేసే అడుగులు చాలా దూకుడుగా ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాల వినికిడి. గ‌తానికి భిన్నంగా ఈసారి ఆయ‌న వేసే అడుగులు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో…చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • AP Elections
  • chandrababu naidu

Related News

Chandrababu Naidu

Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాలు మహిళా బిల్లు విషయంలో చేసిన ద్రోహాన్ని ఎండగడతామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం మరియు ఎన్డీయే కూటమి ప్రధాన అజెండా అని, బిల్లు వీగిపోయినా తమ పోరాటం ఆగదని స్పష్టం

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

  • AP Lok Sabha Seats Delimitation Bill

    Delimitation Bill: ఏపీలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd