HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Master Strategy On Ysrcp

Chandrababu: చంద్రబాబు `మహా` పోరు

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాన్ని మార్చారు. మహా పాదయాత్ర రూపంలో జరుగుతున్న నష్టాన్ని గ్రహించారని తెలుస్తుంది.

  • Author : CS Rao Date : 26-10-2022 - 2:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాన్ని మార్చారు. మహా పాదయాత్ర రూపంలో జరుగుతున్న నష్టాన్ని గ్రహించారని తెలుస్తుంది. అందుకే నష్టనివారణ చర్యలకు దిగారని పార్టీలో చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల నినాదం వైసీపీకి ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో అనుకూలంగా మారుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన లీడర్లు బాబుకు వివరించారని తెలుస్తుంది. అందుకే ఆ రెండు ప్రాంతాల్లోని సమస్యలపై పోరుకు దిగాలని దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఈనెల 28వ తేదీ నుంచి ఆందోళనలకు టీడీపీ శ్రీకారం చుడుతోంది. ఈనెల 28వ తేదీన రిషికొండను తవ్వేయడంపైన , 29వ తేదీన దసపల్లా భూములపై, 30వ తేదీన అరకులోయలో గంజాయిసాగు, నవంబరు ఒకటోతేదీన అనకాపల్లిలో చక్కెర కర్మాగారాలను మూసేయడంపై, 3వ తేదీన హిర మండలం దగ్గర గొట్ట బ్యారేజ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై పోరుబాటకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Also Read:  AP Politics : జగన్ ఫై `రెడ్డి` తిరుగుబాటు? ముహూర్తం కార్తీక సమారాధన

అమరావతి రైతులు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో 60 రోజులపాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన నాయకుల వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాత్కాలికంగా పాదయాత్ర వాయిదా పడింది. కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు అడ్డుకోవడంతో యాత్రను వాయిదా వేశారు. ఈ యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి మూడు రాజధానుల అనుకూల జేఏసీ, అమరావతి రైతులు మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అయితే యాత్రను రైతులు తాత్కాలికంగా విరమించినప్పటికీ తర్వాత సాగించినా వాతవరణం ఉద్రిక్తంగా మారే అవకాశంఉందని భావిస్తున్నారు. దీన్ని చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని రైతులు అంటున్నారు.

గతంలోనూ చంద్రబాబు అమరావతికి మద్దతుగా జోలె పట్టి వైజాగ్ వరకు వెళ్లలేకపోయారు. కర్నూల్ ను టచ్ చేయలేకపోయారు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మహా పాదయాత్ర తీసుకొచ్చే లాభం కంటే పార్టీకి వచ్చే నష్టం జరుగుతుందని టీడీపీ తాజాగా గుర్తించినట్టు తెలుస్తుంది. అందుకే ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని స్థానిక సమస్యలపై పోరాటం చేయాలనీ టీడీపీ ప్రణాళిక రచించింది.

Also Read:  TDP vs YSRCP : వైసీపీ రాజకీయ లబ్ది కోసమే మూడు రాజధానులు – మాజీ మంత్రి య‌న‌మ‌ల‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi farmers
  • chandrababu naidu
  • maha padayatra
  • telugu desam party

Related News

Chandrababu Naidu Job Calen

ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

ప్రభుత్వ ఆలోచన ప్రకారం, కేవలం ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఆగిపోకుండా, ప్రతి ఏటా ఖాళీలను గుర్తించి భర్తీ చేసేలా ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నిరుద్యోగులు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • 3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

    నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

Latest News

  • మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?

  • పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd