Visakhapatnam: రైలు కింద ఇరుక్కున్న యువతి.. కాపాడిన రైల్వే సిబ్బంది
- By Gopichand Published Date - 07:33 PM, Wed - 7 December 22
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam)లోని దువ్వాడ స్టేషన్ (Duvvada railway station)లో ఓ విద్యార్థిని రైలు నుంచి దిగుతుండగా జారిపడి రైలుకు, ప్లాట్ఫారమ్కు మధ్య ఇరుక్కుపోయిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కళ్లెదుట మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చిన విద్యార్థి పెద్దఎత్తున విలపించింది. అయితే అదృష్టవశాత్తూ రైలు వెంటనే ఆపి బాలికను రక్షించారు.
విజ్ఞాన్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఓ బాలిక గుంటూరు నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలులో అన్నవరంలో ఎక్కింది. దువ్వాడ స్టేషన్ (Duvvada railway station)లో రైలు ఆగిన వెంటనే కదులుతున్న రైలు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన ఆమె ఒక్కసారిగా జారిపడి రైలు ప్లాట్ఫారమ్కు మధ్య ఇరుక్కుపోయింది. బాలిక భయంతో కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది. రైలు వెంటనే ఆగినప్పటికీ రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి బాలికను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. రైల్వే సిబ్బంది వెంటనే రైలును ఆపి బాలికను రక్షించారు. చివరకు ఆమెను బయటకు తీసి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. బాలికను రక్షించిన రైల్వే సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Also Read: CBI: సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఏపీ..
Really a Great job by #RailwayRPF staff, Rescued a lady passenger who caught in between Compartment coach and Platform today while De-boarding at #Duvvada Station . She was saved by breaking the platform carefully and was shifted to nearby Hospital. #Vizag 🙌 pic.twitter.com/NjKJGyrYip
— VIZAG WEATHERMAN 🇮🇳 (@VizagWeather247) December 7, 2022
Tags
Related News
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి