HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rules That Ap People Must Know

New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

New Rules : ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

  • Author : Sudheer Date : 05-11-2025 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీ ద్వారా ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్‌తో అనుసంధానమవుతాయి. ఇది పూర్తిగా ఆధార్‌ ఆధారిత వ్యవస్థ కావడంతో కేవలం అర్హులైనవారికే పథకాల లబ్ధి అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. లబ్ధిదారులు తమ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ ద్వారా ఓటీపీని పొందటం ద్వారా సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు.

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బందిచేత మాత్రమే ఈ పనిని చేయించడం వల్ల సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో ప్రజలే స్వయంగా ఈకేవైసీ చేసుకునేలా ప్రభుత్వం ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే ఈకేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి పథకాల లబ్ధిదారులందరూ ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం అత్యంత అవసరం. ఇది చేయని పక్షంలో పథకాల లబ్ధి తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలు సరిచూసి ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన వర్గంగా పరిగణించబడ్డారు. “తల్లికి వందనం”, “జగనన్న విద్యా దీవెన”, “జగనన్న వసతి దీవెన” వంటి పథకాలను పొందుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వం బాలాధార్‌ నుంచి సాధారణ ఆధార్‌కి అప్‌గ్రేడ్‌ చేయడం కోసం 5–17 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల వివరాలను నవీకరిస్తోంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 20న ప్రారంభమైనప్పటికీ మొంథా తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత, లబ్ధిదారుల అర్హత ధృవీకరణ, మరియు అవినీతి నివారణ లక్ష్యంగా ఈకేవైసీ ప్రక్రియను బలంగా అమలు చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap govt
  • rules
  • schemes

Related News

Jal Jevaan

జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జలజీవన్ మిషన్' (Jal Jeevan Mission) పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వివిధ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో

  • Budget 2026 Amaravati Bill

    బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

  • Dialysis Center

    ఏపీలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు- మంత్రి సత్యకుమార్

  • Ntr Wishes To Lokesh

    Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!

  • Lokesh Bday 2026

    అమరావతి ఆశాకిరణం.. యువత భవిష్యత్ వారధి లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Latest News

  • కేంద్ర బ‌డ్జెట్ 2026.. యువ‌త‌కు రూ. 7 వేల వ‌ర‌కు స్టైపెండ్‌!

  • టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ ప‌వార్.. వైరల్ అవుతున్న పాత‌ ట్వీట్

  • వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!

Trending News

    • విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!

    • అజిత్ ప‌వార్ సంపాద‌న ఎంతో తెలుసా?

    • ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివ‌రి పోస్ట్ ఇదే!

    • అజిత్ పవార్ మృతి పై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్

    • వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్​ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd