HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rules That Ap People Must Know

New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

New Rules : ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

  • Author : Sudheer Date : 05-11-2025 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీ ద్వారా ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్‌తో అనుసంధానమవుతాయి. ఇది పూర్తిగా ఆధార్‌ ఆధారిత వ్యవస్థ కావడంతో కేవలం అర్హులైనవారికే పథకాల లబ్ధి అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. లబ్ధిదారులు తమ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ ద్వారా ఓటీపీని పొందటం ద్వారా సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు.

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బందిచేత మాత్రమే ఈ పనిని చేయించడం వల్ల సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో ప్రజలే స్వయంగా ఈకేవైసీ చేసుకునేలా ప్రభుత్వం ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే ఈకేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి పథకాల లబ్ధిదారులందరూ ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం అత్యంత అవసరం. ఇది చేయని పక్షంలో పథకాల లబ్ధి తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలు సరిచూసి ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన వర్గంగా పరిగణించబడ్డారు. “తల్లికి వందనం”, “జగనన్న విద్యా దీవెన”, “జగనన్న వసతి దీవెన” వంటి పథకాలను పొందుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వం బాలాధార్‌ నుంచి సాధారణ ఆధార్‌కి అప్‌గ్రేడ్‌ చేయడం కోసం 5–17 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల వివరాలను నవీకరిస్తోంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 20న ప్రారంభమైనప్పటికీ మొంథా తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత, లబ్ధిదారుల అర్హత ధృవీకరణ, మరియు అవినీతి నివారణ లక్ష్యంగా ఈకేవైసీ ప్రక్రియను బలంగా అమలు చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap govt
  • rules
  • schemes

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd