HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rules That Ap People Must Know

New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

New Rules : ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

  • Author : Sudheer Date : 05-11-2025 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీ ద్వారా ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్‌తో అనుసంధానమవుతాయి. ఇది పూర్తిగా ఆధార్‌ ఆధారిత వ్యవస్థ కావడంతో కేవలం అర్హులైనవారికే పథకాల లబ్ధి అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. లబ్ధిదారులు తమ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ ద్వారా ఓటీపీని పొందటం ద్వారా సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు.

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బందిచేత మాత్రమే ఈ పనిని చేయించడం వల్ల సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో ప్రజలే స్వయంగా ఈకేవైసీ చేసుకునేలా ప్రభుత్వం ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే ఈకేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి పథకాల లబ్ధిదారులందరూ ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం అత్యంత అవసరం. ఇది చేయని పక్షంలో పథకాల లబ్ధి తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలు సరిచూసి ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన వర్గంగా పరిగణించబడ్డారు. “తల్లికి వందనం”, “జగనన్న విద్యా దీవెన”, “జగనన్న వసతి దీవెన” వంటి పథకాలను పొందుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వం బాలాధార్‌ నుంచి సాధారణ ఆధార్‌కి అప్‌గ్రేడ్‌ చేయడం కోసం 5–17 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల వివరాలను నవీకరిస్తోంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 20న ప్రారంభమైనప్పటికీ మొంథా తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత, లబ్ధిదారుల అర్హత ధృవీకరణ, మరియు అవినీతి నివారణ లక్ష్యంగా ఈకేవైసీ ప్రక్రియను బలంగా అమలు చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap govt
  • rules
  • schemes

Related News

Farmers Drumstick

ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Farmers :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జ

  • Nagababu

    Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

  • Tamil Nadu

    Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి

  • Chandrababu

    CBN : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – సీఎం చంద్రబాబు

Latest News

  • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

  • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

  • కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Trending News

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd