HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rules That Ap People Must Know

New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

New Rules : ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

  • By Sudheer Published Date - 02:19 PM, Wed - 5 November 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీ ద్వారా ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్‌తో అనుసంధానమవుతాయి. ఇది పూర్తిగా ఆధార్‌ ఆధారిత వ్యవస్థ కావడంతో కేవలం అర్హులైనవారికే పథకాల లబ్ధి అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. లబ్ధిదారులు తమ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ ద్వారా ఓటీపీని పొందటం ద్వారా సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు.

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బందిచేత మాత్రమే ఈ పనిని చేయించడం వల్ల సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో ప్రజలే స్వయంగా ఈకేవైసీ చేసుకునేలా ప్రభుత్వం ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే ఈకేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి పథకాల లబ్ధిదారులందరూ ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం అత్యంత అవసరం. ఇది చేయని పక్షంలో పథకాల లబ్ధి తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలు సరిచూసి ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన వర్గంగా పరిగణించబడ్డారు. “తల్లికి వందనం”, “జగనన్న విద్యా దీవెన”, “జగనన్న వసతి దీవెన” వంటి పథకాలను పొందుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వం బాలాధార్‌ నుంచి సాధారణ ఆధార్‌కి అప్‌గ్రేడ్‌ చేయడం కోసం 5–17 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల వివరాలను నవీకరిస్తోంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 20న ప్రారంభమైనప్పటికీ మొంథా తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత, లబ్ధిదారుల అర్హత ధృవీకరణ, మరియు అవినీతి నివారణ లక్ష్యంగా ఈకేవైసీ ప్రక్రియను బలంగా అమలు చేస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap govt
  • rules
  • schemes

Related News

Chandrababu

CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

CBN : తాజాగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేంద్రంలో జరిగిన సమీక్షలో ప్రభుత్వ శాఖలు అందించే సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరాలని అధికారులకు స్పష్టం చేశారు

  • New Districts In Ap

    New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

  • Grama Panchayat Election In

    Grama Panchayat Election : ఏపీలో మళ్లీ ఎన్నికల జాతర

  • Venkatrao Gannavaram

    Gannavaram : గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ వెంకట్రావు

  • 'Student Assembly' as a platform for diverse ideas: Students are MLAs..

    Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..

Latest News

  • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

  • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

  • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

  • T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

  • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd