HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Revanth Campaign In Ap

AP : ఏపీలో రేవంత్ ప్రచారం..జగన్ తట్టుకోగలడా..?

  • By Sudheer Published Date - 09:19 PM, Fri - 16 February 24
  • daily-hunt
Sharmila Meets Revanth
Sharmila Meets Revanth

ఇప్పటికే వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు వల్ల ఇప్పటీకే చాలామంది వైసీపీ కి బై బై చెప్పి ఇతర పార్టీలలో చేరారు..మరికొంతమంది చేరే అవకాశం ఉంది. మరోపక్క టీడీపీ – జనసేన (TDP-Janasena) పొత్తులో బిజెపి (BJP) చేరేందుకు సిద్ధమైంది..వీటి అన్నింటికంటే సొంత చెల్లి షర్మిల తో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన దగ్గరి నుండి జగన్ ను టార్గెట్ గా పెట్టుకుంది. ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూనే..మరోపక్క వ్యక్తిగత విమర్శలు చేస్తూ చెమటలు పట్టిస్తుంది. ఇలా ఇన్ని సమస్యలతో సతమవుతుండగా..ఇప్పుడు మరో సమస్య ఎదురుకాబోతుంది.

మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా తో ప్రజల్లోకి వెళ్తున్నారు..అలాగే నారా లోకేష్ కూడా శంఖారావం తో యాత్ర చేపట్టారు. మరికొద్ది రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఇక షర్మిల సైతం యాత్ర కొనసాగిస్తోంది. ఇలా అంత ప్రచారంలో బిజీ అవుతున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ సైతం ఏపీలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ (Congress) పూర్తిగా కనుమరుగైన సంగతి తెలిసిందే. అటు తెలంగాణ లోను పదేళ్లుగా అధికారంకు దూరమైంది. ఈ క్రమంలో రేవంత్ పగ్గాలు చేపట్టి..ఏకంగా అధికారంలోకి వచ్చేలా చేసాడు. ఇక ఇప్పుడు ఏపీలోనూ అధికారం లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ గా షర్మిల (YS Sharmila) తన దూకుడు కనపరుస్తుండగా..ఇక షర్మిల కు తోడుగా రేవంత్ బరిలోకి దిగబోతున్నాడు. నెలాఖరులోపు విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి.. ఏపీ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్నదానిపై మాట్లాడారు. బహిరంగసభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈరోజు మీడియాకు తెలియజేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని , ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాగూర్‌లతో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వస్తారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. సో రేవంత్ ..ఏపీ లో తన వాయిస్ వినిపించబోతున్నాడు. మరి రేవంత్ ప్రచారంలో తన గురువు చంద్రబాబు ఫై విమర్శలు చేస్తారా..? లేక జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తాడా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి జగన్ కు ప్రస్తుతం ఉన్న టెన్షన్ లకు మరికొన్ని టెన్షన్లు తప్పడం లేదని అర్ధం అవుతుంది.

Read Also : Ram Puri Jagannath : డబుల్ ఇస్మార్ట్.. ఈ డేట్ కు ఫిక్స్ అయారా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP campaign
  • cm revanth

Related News

Uttam Revanth

SLBC : ఉత్తమ్ కుమార్ సలహాలతో ముందుకు వెళ్తాము – సీఎం రేవంత్

SLBC : “ఇప్పటి టెక్నాలజీ 20 ఏళ్ల కిందటి దానికంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందింది. అప్పట్లో ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ యంత్రాలు ఇప్పుడు పనికిరావు. కాబట్టి కొత్త సాంకేతికతను ఉపయోగించి మిగిలిన 9.88 కిలోమీటర్ల టన్నెల్‌ను పూర్తి చేయనున్నాం” అని తెలిపారు

  • Sri Charani Cricketer

    Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • CM Chandrababu

    New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

  • Bus Accidents Oct 4th

    Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

  • 1.2 Lakh Jobs

    1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

Latest News

  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

  • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

  • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd