HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Renew Power Invests Rs 82000 Crore In Ap

Renew Power : ఏపీలో రెన్యూ పవర్ రూ.82వేల కోట్ల పెట్టుబడి

Renew Power : ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అనేక పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ పెట్టుబడులను ప్రకటించగా ..తాజాగా మరో భారీ సంస్థ వేలకోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా మంత్రి లోకేష్ తెలిపారు

  • Author : Sudheer Date : 13-11-2025 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renewap
Renewap

ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అనేక పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ పెట్టుబడులను ప్రకటించగా ..తాజాగా మరో భారీ సంస్థ వేలకోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా మంత్రి లోకేష్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ పునరుత్పత్తి శక్తి సంస్థ రెన్యూ పవర్‌ తిరిగి ఏపీలో భారీ పెట్టుబడులతో అడుగుపెడుతోంది. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఈ సంస్థ, ఇప్పుడు రూ.82 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించినట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు పునరుత్పత్తి శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా, రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్ ఎనర్జీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దనున్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదరనున్నాయి.

Ryan Ten Doeschate: టీమిండియాను హెచ్చ‌రించిన భార‌త కోచ్‌!

ఇక మంత్రి నారా లోకేష్ ఈ రోజు పలు ఐటీ మరియు ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో టెక్ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, సెయిల్స్ సాఫ్ట్‌వేర్, ఐ స్పేస్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్‌, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు కలిసి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. అంతేకాక, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇవాళ విడుదల చేయనున్నారు. దీనివల్ల తూర్పు తీరంలో పరిశ్రమల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

Vijay Deverakonda: మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ‘ముద్దు’ వీడియో!

మంత్రి లోకేష్ వివరించిన ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, ప్రధాని మోదీ సహకారం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి ఫలితంగా ఇప్పటికే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇక సీఐఐ సదస్సు సందర్భంగా మరో 410 ఎంఓయూలు – 120 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు కుదరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు రాబోయే 12 నెలల్లో క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 7.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టికానున్నాయి. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ప్రతీ అవకాశం వినియోగిస్తోందని లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు 45 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, కేంద్రమంత్రులు హాజరవుతుండటం ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడి వాతావరణానికి నూతన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టనుంది.

#ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025
After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be… pic.twitter.com/JczVgbtcEO

— Lokesh Nara (@naralokesh) November 13, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Lokesh
  • Renew Power
  • ReNew Power Announces Rs.82

Related News

Apsrtc Samme

వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

  • Sankranthi Toll Gate

    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

  • Magnum Wings Air Taxi

    వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

  • Amaravati

    అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

Latest News

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

  • కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd