Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.
- By Pasha Published Date - 09:03 AM, Mon - 18 March 24

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచే జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 20 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ నెల 22న మధ్యాహ్నం వరకు డబ్లు చెల్లించి టిక్కెట్లు కన్ఫామ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ టిక్కెట్లతో పాటు శ్రీవారి(Tirumala) ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా ఈ నెల 21న టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల కోసం ఈనెల 21న ఉదయం 10 గంటలకు ఈ టిక్కెట్లను అందుబాటులో ఉంచుతారు. అదే రోజు జ్యేష్ఠాభిషేకం ఉత్సవం టిక్కెట్లను విడుదల చేస్తారు. జ్యేష్ఠాభిషేకం ఉత్సవం జూన్ 19 నుంచి 21 వరకు జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join
- మార్చి 21 న మధ్యాహ్నం 3 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవల వర్చువల్ కోటా టికెట్లు విడుదల చేయనున్నారు.
- ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు.
- 23న మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను కూడా విడుదల చేస్తారు.
- మార్చి 25న ఉదయం పదిగంటలకు జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు.
Also Read : Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు
- మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నారు.
- ఈ నెల27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను ఆన్లైన్లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, ఒంటింగంటకు పరకామణి సేవ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో ఉంచనుంది.
- భక్తులు ఇతర సేవల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.