Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.
- By Pasha Published Date - 09:03 AM, Mon - 18 March 24
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచే జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 20 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ నెల 22న మధ్యాహ్నం వరకు డబ్లు చెల్లించి టిక్కెట్లు కన్ఫామ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ టిక్కెట్లతో పాటు శ్రీవారి(Tirumala) ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా ఈ నెల 21న టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల కోసం ఈనెల 21న ఉదయం 10 గంటలకు ఈ టిక్కెట్లను అందుబాటులో ఉంచుతారు. అదే రోజు జ్యేష్ఠాభిషేకం ఉత్సవం టిక్కెట్లను విడుదల చేస్తారు. జ్యేష్ఠాభిషేకం ఉత్సవం జూన్ 19 నుంచి 21 వరకు జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join
- మార్చి 21 న మధ్యాహ్నం 3 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవల వర్చువల్ కోటా టికెట్లు విడుదల చేయనున్నారు.
- ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు.
- 23న మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను కూడా విడుదల చేస్తారు.
- మార్చి 25న ఉదయం పదిగంటలకు జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు.
Also Read : Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు
- మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నారు.
- ఈ నెల27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను ఆన్లైన్లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, ఒంటింగంటకు పరకామణి సేవ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో ఉంచనుంది.
- భక్తులు ఇతర సేవల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�