Rape Case : మచిలీపట్నంలో దారుణం.. పోలీసులమంటూ బెదిరించి మహిళను..?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు
- By Prasad Published Date - 09:53 AM, Tue - 16 August 22
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతి న్యూడ్ వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి ఇటీవల రాత్రి సమయంలో పనిముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో బైక్ పై వచ్చిన యువకులు పోలీసులమని చెప్పి బైక్ పై ఎక్కాలని బెదిరించారు. అందుకు యువతి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనక ఖాళీ స్థలంలోకి యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. యువతిపై దారుణానికి పాల్పడి న్యూడ్ వీడియోలు తీశారు. యువతి ఫోన్ కూడా లాక్కున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని యువతిని బెదిరించారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. ఈ దారుణం జరిగిన తర్వాత రోజు తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఓ యువకుడు తన ఇంటి ముందు నుంచే వెళ్తుండటాన్ని గుర్తించింది యువతి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో ఆ యువకుడ్ని పట్టుకుంది. అనంతరం పోలీసులకు అప్పగించింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని సుకర్లాబాద్ చెందిన నారాయణగా గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Related News
2 Fishes – 4 Lakhs : 2 చేపలకు రూ.4 లక్షల ధర.. ఎందుకో తెలుసా ?
2 Fishes - 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి.