Union Budget 2025 : నిర్మలాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు
Union Budget 2025 : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సముచిత సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు
- By Sudheer Published Date - 03:51 PM, Sat - 1 February 25

ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సముచిత సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రత్యేకంగా, జల్ జీవన్ మిషన్ నిధుల అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
BUDGET: కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గత YCP ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ప్రజలకు మౌలిక వసతులు అందించాల్సిన నిధులను సద్వినియోగం చేయడంలో లోపాలు చోటుచేసుకున్నాయని అన్నారు. అయితే, 2028 వరకు ఈ పథకం పొడిగింపుతో రాష్ట్రానికి మరిన్ని నిధులు లభిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు రావలసిన నిధులు సాధించేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీమ్ వర్క్ చేస్తామని, ఎంత వీలైతే అంత కేంద్ర సహాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలంటే కేంద్ర సహాయ సహకారాలు మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు.
ఇక, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు గురించి కూడా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. అదనంగా మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. ఓవరాల్ గా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టులు పొడిగింపుతో మరింత ప్రయోజనం కలుగుతుందని, కొత్త ఎయిర్పోర్టులు రాకతో రవాణా మార్గాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.