HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Prashant Kishore Says Even If Bjp Wins It Will Get Less Than 370 Lok Sabha Seats

Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్‌కు ఓటమి ఖాయం : పీకే

లోక్‌సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Author : Pasha Date : 21-05-2024 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prashanth Kishor (1)
Prashanth Kishor (1)

Prashant Kishore : లోక్‌సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని మరోసారి ప్రధాని మోడీ గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మోడీ, అమిత్‌షా చెబుతున్నట్లుగా బీజేపీకి ఈసారి 370కి మించి లోక్‌సభ సీట్లు దాటకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లే వస్తాయన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.  దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ, బీజేపీలపై అసంతృప్తి మాత్రమే ఉందని.. ఆగ్రహం లేదని పీకే అభిప్రాయపడ్డారు. అందుకే ఈసారి బీజేపీ 2019 నాటికి సరి సమానమైన లోక్‌సభ సీట్లను కానీ అంతకంటే ఎక్కువ సీట్లను కానీ గెల్చుకునే ఛాన్స్ ఉంటుందని ఆయన వివరించారు. ‘‘ఉత్తర, పశ్చిమ భారత్‌లో దాదాపు 325 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీకి 2014 సంవత్సరం నుంచే బలమైన పట్టు ఉంది. తూర్పు, దక్షిణాదిన బీజేపీకి బలం తక్కువ. గెలుపుపై ప్రభావం ఉంటే ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ, ఈసారి తూర్పు, దక్షిణాదిన ఓట్లతో పాటు సీట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు చాలా తక్కువ’’  పీకే (Prashant Kishore) తనదైన శైలిలో విశ్లేషించారు.

We’re now on WhatsApp. Click to Join

మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం తప్పదని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల్లో గెలవబోతున్నామని సీఎం జగన్‌ చెబుతున్నట్లుగానే అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారు. నేను గత పదేళ్లుగా ఎన్నికల్లో పనిచేస్తున్నాను. ఫలితాల కంటే ముందే ఓటమిని అంగీకరించినవారు ఇప్పటివరకు  నాకు ఎవరూ కనిపించలేదు’’ అని పీకే కామెంట్ చేశారు.

Also Read :BORG Drinking : బోర్గ్ డ్రింకింగ్ ట్రెండ్.. మత్తు ఉచ్చులో యువత

‘‘జూన్ 4న ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా కచ్చితంగా చూడండి.. వచ్చే రౌండ్లలో తమకు మెజార్టీ ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చాలామంది ధీమా వ్యక్తం చేస్తారు’’ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. జగన్ మాత్రం అలా కాకుండా గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని అంటున్నారు’’ అని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే దాకా గెలుపు ఓటములపై చర్చకు అంతమే ఉండదని పీకే చెప్పారు.

Also Read :Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : పోలీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • bjp
  • elections 2024
  • lok sabha
  • prashant kishore

Related News

Maharashtra Local Body

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

మహారాష్ట్ర లోకల్ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది. 288 స్థానిక సంస్థలకు ఎన్నిక జరుగగా,214 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. ఇంకా లెక్కింపు కొనసాగుతుండడం తో ఇంకొన్ని స్థానాల్లో బిజెపి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

  • CM Revanth Reddy

    సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

  • Rahul Speech

    దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు- బీజేపీ ఆరోపణ

  • Vb G Ram G Bill

    రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?

  • Private companies enter the nuclear sector.. 'Peace' Bill approved in Lok Sabha

    ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్‌సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం

Latest News

  • ఆలుగ‌డ్డ‌ల‌తో ఎన్నో లాభాలు.. కానీ వాటిపై అపోహలు..నిజాలు ఏమిటంటే..!

  • ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్‌

  • కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

  • కుప్పకూలుతున్న స్టార్‌లింక్‌ ..భూమివైపు దూసుకొస్తున్న శాటిలైట్‌ శకలాలు!

  • చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి?.. ప్రధాన కారణాలు ఏంటి?

Trending News

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd