HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Political Split In Jc Family Tdp Rejected The Mp Ticket To Jc Diwakar Reddys Son

JC Diwakar Reddy : జేసీ ఫ్యామిలీలో రాజకీయ చీలిక.. దివాకర్‌రెడ్డి‌ కొడుకుకు టీడీపీ మొండిచెయ్యి

JC Diwakar Reddy :  అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలక్‌ ఇచ్చింది. 

  • By Pasha Published Date - 04:25 PM, Sat - 27 January 24
  • daily-hunt
Jc Diwakar Reddy
Jc Diwakar Reddy

JC Diwakar Reddy :  అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలక్‌ ఇచ్చింది.  జనసేనతో టీడీపీ సీట్ల సర్దుబాటు కారణంగా జేసీ ఫ్యామిలీలో రాజకీయ చీలిక ఏర్పడింది. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. అయితే  జేసీ దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌కు మాత్రం సైకిల్ పార్టీ మొండిచెయ్యి  మిగిల్చింది.  అనంతపురం ఎంపీ సీటు కోసం జేసీ పవన్‌ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా  అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని జేసీ పవన్‌ టీడీపీని కోరారు. ఈక్రమంలోనే ఇటీవల ఆయన  చంద్రబాబును కూడా కలిశారు. అయితే టిక్కెట్‌ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ పయనం ఎటు వైపు అనే చర్చకు తెర లేచింది.  రాయదుర్గం టిక్కెట్‌ను తన అల్లుడు దీపక్‌రెడ్డికి కేటాయించాలని నారా లోకేశ్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరుతున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్‌రెడ్డి(JC Diwakar Reddy) కొడుకు పవన్‌రెడ్డి కూడా టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఒకవేళ పవన్‌కు టికెట్‌ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. ఎందుకంటే కుటుంబానికి ఒక్కటే టికెట్‌ అని బాబు తేల్చి చెప్పారు. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది.  మొత్తం మీద అనంతపురం స్థానాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయని ఆ పార్టీ నేతలు కోడైకూస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీ వైసీపీ గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇంఛార్జిల నియామకం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు లిస్టులని ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఐదో లిస్టుపై కసరత్తు చేస్తోంది. టీడీపీ అధినేత ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా .. జనసేన కూడా ఇద్దరిని ప్రకటించింది. 

Also Read :Abhishek – Aishwarya : ఐశ్వర్యతో విడాకుల పుకార్లు.. అభిషేక్ బచ్చన్ పోస్ట్ వైరల్

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్‌ నాయకుడైన జితేందర్‌గౌడ్‌కు టికెట్‌ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు. పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • JC Diwakar reddy
  • JC family
  • Nara Chandrababu Naidu
  • tdp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd