HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pilli Subhash Takes Daring Step Is Jagan Behind The Game

AP Politics: పిల్లి అంత సాహసం ఎందుకు చేశారు? జగన్ కావాలని చేయిస్తున్నారా?

ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు.

  • By Hashtag U Published Date - 02:00 PM, Fri - 20 May 22
  • daily-hunt
Pilli Subhash
Pilli Subhash

ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు. సొంత పార్టీ ఎంపీ.. జగన్ ప్రభుత్వంపై ఈ ఆరోపణ చేసినప్పుడు సహజంగానే రాజకీయంగా పెద్ద రచ్చ, చర్చ జరగాల్సింది. కాని, అలా జరగలేదు. రైతులు ఈ-కేవైసీ నింపకపోవడం వల్ల ఈ-క్రాప్ నమోదులో పెద్ద స్కాం జరుగుతోందన్నారు.
ఆధార్‌తో లింక్ లేకపోవడంతో పెద్ద వ్యాపారులు, మిల్లర్లు పేర్లు తారుమారు చేస్తూ భారీగా లాభం పొందుతున్నారని చెప్పుకొచ్చారు. సుమారు 17వేల మంది రైతుల అడ్రస్సులు గల్లంతయ్యాయని ఆరోపించారు. ముఖ్యంగా అధికారులే ఈ స్కామ్‌ను దగ్గరుండి చేయిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి అధికార పార్టీ ఎంపీ నోటి నుంచి స్కామ్ అనే మాట రావడం జరగదు. దీంతో దీని వెనక సీఎం జగన్ గాని ఉండి నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీకే మార్క్ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయన్నది ప్రతిపక్షాల వాదన కూడా.

ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణాన్ని ప్రతిపక్షం బయటపెట్టి ఉంటే నానా రచ్చ జరిగేది. అదే అధికార పార్టీ నేతనే చేస్తే. చూసారా.. మా పార్టీ నేతలు అవినీతిని సహించరు అని చెప్పుకోవచ్చు. తమ ప్రభుత్వమే అయినా సరే.. తప్పు చేస్తే ఎలాంటి అధికారినీ వదిలిపెట్టం అని గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు. పైగా రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వబోమనే సంకేతాలు పంపొచ్చు.
ఇదంతా పార్టీకి, ప్రభుత్వానికి మంచి మైలేజీ తీసుకొస్తాయి కూడా. కాని, పిల్లి సుభాష్ చేసిన కుంభకోణం ఆరోపణలు అంత ప్రకంపనలేం సృష్టించలేదు. నిజంగా జగనే దీని వెనక ఉండి ఉంటే.. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని అర్ధం. అందుకే, మంత్రి కారుమూరి హడావుడిగా నష్టనివారణకు దిగారు. ఈకేవైసీలో జాప్యం గురించి మాత్రమే పిల్లి సుభాష్ మాట్లాడారని చెప్పుకొచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • paddy procurement
  • pilli subhash chandra bose
  • YS Jagan Mohan Reddy

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd