Bose : వైస్సార్సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ
రామచంద్రపురం లో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Bose) - మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
- By Sudheer Published Date - 08:09 PM, Tue - 25 July 23
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) వైస్సార్సీపీ పార్టీ (YSRCP) ని వీడుతున్నాడని..త్వరలో జనసేన పార్టీ (జనసేన ) లో ఆయనతో పాటు ఆయన కుమారుడు చేరబోతున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ఆ వార్తలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YSRCP) లో టిక్కెట్ల లొల్లి మొదలైంది. గత కొద్దీ రోజులుగా రామచంద్రపురం లో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (Chelluboina Venu Gopala Krishna) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎవరికీ వారు ఈసారి నాకంటే నాకు టికెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావించారు. తనకు టిక్కెట్ దక్కకపోతే కుమారుడికి అవకాశం కల్పించాలని పార్టీకి విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో మారు అవకాశం ఉంటుందనే సంకేతాలు పార్టీ నుంచి రావడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ వైస్సార్సీపీని వీడబోతున్నారని , త్వరలోనే జనసేన పార్టీ లో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం చూసి వైస్సార్సీపీ అధిష్టానం మేలుకుంది. వెంటనే నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్ ((Pilli Subhash Chandra Bose)) ను బుజ్జగించడం చేసారు.
దీంతో తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. తాను టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలలో చేరుబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు బోస్ తెలిపారు. రామచంద్రాపురంలో అభ్యర్థి ఎవరో సీఎం జగన్ (Jagan) నిర్ణయిస్తారని, పార్టీ నిర్మాణంలో తాను కూడా ఒక పిల్లర్ను అని బోస్ వెల్లడించారు. రామచంద్రాపురంలో సీఎం ప్రత్యేక సర్వే చేయిస్తానని మాట ఇచ్చారని, అప్పుడు ఎవరి బలం ఏంటి అనేది తేలుతుందన్నారు.
వైస్సార్సీపీ తన సొంత పార్టీ అని.. తన చేతులతో దీన్ని నిర్మించానని పిల్లి సుభాష్ చంద్రబోస్ ((Pilli Subhash Chandra Bose)) చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకూ తనకు ఏ లోటూ రానివ్వలేదని, చాలా గౌరవంగా చూసుకున్నారని పేర్కొన్నారు. ఎలాంటి వినతిపత్రాలను అందజేసినా.. వాటిని నెరవేర్చారని వివరించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత అవసరాలు లేవని, ప్రజల కోసమే పని చేశానని పేర్కొన్నారు.
Read Also: Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి భారీ ఊరట..కీలక కేసు కొట్టివేత
Tags
Related News
Yarapathineni Srinivasa Rao : వైసీపీ నేతలపై ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, గురజాల అసెంబ్లీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.