Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి భారీ ఊరట..కీలక కేసు కొట్టివేత
మెగాస్టార్ చిరంజీవి కి భారీ ఊరట లభించింది
- By Sudheer Published Date - 07:37 PM, Tue - 25 July 23
మెగాస్టార్ చిరంజీవి కి భారీ ఊరట లభించింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు (AP High Court ) నేడు కొట్టివేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం(Prajarajyam Party) పేరుతో 2008 లో పార్టీ పెట్టిన చిరంజీవి..2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల బరిలో పోటీ చేసారు. 294 స్థానాల్లో ప్రజారాజ్యం తరుపు అభ్యర్థులు బరిలో నిల్చుంటే.. 18 స్థానాలు మాత్రం గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెస్ (Congress Party) పార్టీలో ప్రజారాజ్యం ను విలీనం చేసారు.
2014 ఎన్నికల సమయంలో గుంటూరు లో చిరంజీవి (Chiranjeevi) కాంగ్రెస్ పార్టీ తరపున ఓ సమావేశం ఏర్పాటు చేసారు. నిర్ణీత టైంలోపు మీటింగ్ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కొన్నాళ్ల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court ) ను ఆశ్రయించారు. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టేస్తూ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.
ఇదే కాదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank) విషయంలో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇటీవల కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. న్యాయ స్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత వారం తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో వారు చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఇలా వారం లో రెండు మెగా శుభవార్తలు అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన భోళా శంకర్ (Bhola Shankar) మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో తమన్నా, కీర్తిసురేష్ , సుశాంత్ లు ప్రధాన పాత్రలు చేసారు.
Read Also :Pre Release : ఆలస్యంగా ‘BRO’ ప్రీ రిలీజ్ వేడుక..మేకర్స్ ప్రకటన
Related News
Vishwambhara : ‘విశ్వంభర’ లో మరో నటి..?
సినిమా సెకండ్ హాఫ్ లో కనిపించే ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటిని ఎంచుకోవాలి డైరెక్టర్ భావించారట. సినిమాకే హైలైట్గా నిలవనున్న ఈ పాత్ర కోసం వశిష్ట ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట