HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >People Have Put An End To Five Years Of Authoritarian Rule With Their Votes Pawan Kalyan

Pawan Kalyan : అయిదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో ముగింపు పలికారు : పవన్ కల్యాణ్

భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేందుకు ఎన్డీయే కూటమి కట్టుబడి ఉన్నది అని ఆయన వివరించారు.

  • By Latha Suma Published Date - 03:52 PM, Wed - 4 June 25
  • daily-hunt
People have put an end to five years of authoritarian rule with their votes: Pawan Kalyan
People have put an end to five years of authoritarian rule with their votes: Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయాన్ని సాధించి నేటికి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీకగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయిదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో ముగింపు పలికారని, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించిన ఘనత ప్రజలదేనని ఆయన గుర్తు చేశారు.

Read Also: TG TET 2025 : జూన్‌ 18 నుంచి తెలంగాణ టెట్‌ పరీక్షలు.. ఏ సబ్జెక్టు ఎప్పుడంటే?

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దృఢ నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతా మార్గదర్శనం, జనసైనికులు మరియు వీరమహిళల త్యాగాల స్పూర్తి ఇవన్నీ కలిసికట్టుగా ఈ విజయాన్ని సాధించాయి అని వివరించారు. ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రక విజయానికి జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విశేషంగా ఆకర్షణగా నిలిచిందని, ఆ విజయానికి ఏడాది పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును అపారమైన బాధ్యతగా తీసుకుని, గత ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులను సరిదిద్దే కృషిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేందుకు ఎన్డీయే కూటమి కట్టుబడి ఉన్నది అని ఆయన వివరించారు.

రాజకీయాలకు అతీతంగా, ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ, జనసేన, తెలుగుదేశం, బీజేపీల కూటమి సమిష్టిగా ప్రజా పాలనను మెరుగుపరచేందుకు చురుగ్గా పనిచేస్తోందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలనను అందించడమే తమ ప్రాధాన్యత అని, అభివృద్ధి, సంక్షేమం రెండు పుంజాలు తమ పాలనకు మూల స్తంభాలని స్పష్టంగా చెప్పారు. ఈ విజయంలో భాగస్వాములైన జనసైనికులకు, వీరమహిళలకు, తెలుగుదేశం మరియు బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకత్వానికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి శ్రమ, పట్టుదల వల్లే ఈ ఘనవిజయం సాధ్యమైంది అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయ దినోత్సవం సందర్భంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యతను మరింతగా ఎరుకపెట్టుకుంటామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పాలన సాగిస్తామని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.

Read Also: Ambati Rambabu : గుంటూరు కలెక్టరేట్‌ వద్ద అంబటి రాంబాబు హల్‌చల్‌

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • janasena party
  • nda alliance
  • Pawan Kalyan
  • Political Victory
  • Swarna Andhra 2047
  • Vikshit Bharat 2047

Related News

Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.

  • Sugali Preethi Case Cbi

    Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd