PDF MLC Shaik Sabji Died : పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం..రోడ్డు గుంతలే కారణమా..?
- Author : Sudheer
Date : 15-12-2023 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందారు. అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపి వెళుతుండగా ఈ ప్రమాదం (Accident) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.
భీమవరం నుంచి తిరుగు ప్రయాణమైన చెరుకువాడ వద్ద వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ స్వగ్రామం తూగో.. జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం.
We’re now on WhatsApp. Click to Join.
ఏలూరు – భీమవరం మధ్య రోడ్ భారీగా గుంతలు పడి ఉంటుంది. ఈ కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయని కొంత కాలంగా వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కారుకు ఎదురుగా వస్తున్న వాహనం కూడా రోడ్ గంతల కారణంగానే అదుపు తప్పినట్లగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
షేక్ సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున 2021లో విజయం సాధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఈయన మరణం పట్ల ఏపీ కాబినెట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
Read Also : Telangana Whips : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు