Maha Kumbh Mela 2025 : పుణ్యస్నానం ఆచరించిన పవన్ కల్యాణ్
Maha Kumbh Mela 2025 : మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్, తన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు
- Author : Sudheer
Date : 18-02-2025 - 7:28 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025) విశేషమైన దివ్య కార్యక్రమంగా కొనసాగుతోంది. ఈ మహా ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్, తన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.
India Squad: ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్పై ఆడే టీమ్ ఇండియా జట్టు ఇదే!
పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పాల్గొనడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా పవన్ ఆలయాల పర్యటనలు, హిందూ సంప్రదాయాలపై తన ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుంభమేళాకు హాజరై పుణ్యస్నానం చేయడం సనాతన ధర్మ విశ్వాసులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పవన్ మెడలో జంధ్యం ధరించి, సంప్రదాయ దుస్తుల్లో తన కుటుంబంతో కలిసి గంగలో స్నానం చేయడం భక్తుల దృష్టిని ఆకర్షించింది. ఈ మహా కుంభమేళాలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలే ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో సహా పుణ్యస్నానం చేసారు. అలాగే టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉండడం విశేషం. పవన్ కుంభమేళాకు హాజరయ్యే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పవన్ రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని తెలుస్తోంది.
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా కాదు మృత్యుకుంభమేళా – సీఎం మమతా బెనర్జీ
భారతదేశంలో మహా కుంభమేళా ఎంతో పవిత్రమైన వేడుక. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహోత్సవం లోక కల్యాణాన్ని సూచించే పవిత్ర యజ్ఞంగా భావించబడుతుంది. అష్టగ్రహ సంయోగ సమయంలో గంగలో పుణ్యస్నానం చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. పవన్ కళ్యాణ్ హాజరు కావడం ద్వారా కుంభమేళా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్న పవన్, ఆధ్యాత్మిక దృక్పథాన్ని కూడా సమానంగా పాటిస్తుండడం విశేషం. ఈ పుణ్యస్నానం ద్వారా పవన్ తన సనాతన ధర్మ నిబద్ధతను మరోసారి ప్రదర్శించారని విశ్లేషకులు అంటున్నారు.
ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో మహకుంభ మేళా సందర్భంగా కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#Mahakumbh #PawanKalyanAtMahakumbh pic.twitter.com/h30LXjufgI
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 18, 2025