Pawan Kalyan : స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ రికార్డ్స్ లో లేని రూ.1,066 కోట్లు
అయిదేళ్ళలో కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు
- By Sudheer Published Date - 06:34 PM, Wed - 26 June 24
![Pawan Kalyan : స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ రికార్డ్స్ లో లేని రూ.1,066 కోట్లు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/pawanreview.jpg)
ఉపముఖ్యమంత్రి తో పాటు పలుశాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కూడా పవన్ (Pawan Kalyan) బిజీ బిజీ గా ఉన్నారు. ఓ పక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే..మరోపక్క వాటిని తీర్చేందుకు అధికారులతో మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యపేతమగు ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తు వాటిని ఎలా పరిష్కరించాలో తెలియజేస్తున్నారు. బుధవారం ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ( Swachandra Corporation)పై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ఉన్నతాధికారులతో పాటు ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. కార్పొరేషన్ తీరుతెన్నులపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం, ఆయన స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. అయిదేళ్ళలో కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమే అని అధికారులు చెప్పడం తో ఓకేంత షాక్ అయ్యారు పవన్. ఈ డబ్బు కేవలం అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి అన్నారు.
• 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
• కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? అని ప్రశ్నించారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంధ్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే. స్వచ్ఛాంధ్ర నిధులనూ వదల్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమయితేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని ఉపముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా- ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ తెలిపారు. అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఆయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణ అన్నారు. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. pic.twitter.com/mfap5xfUMO
— JanaSena Party (@JanaSenaParty) June 26, 2024
Read Also : Kangana-Chirag: పార్లమెంట్ సాక్షిగా కంగనా, చిరాగ్ పాశ్వాన్ వీడియో వైరల్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Pawan Kalyan : రేపే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన.. షెడ్యూల్ ఇదే..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/pawan-kalyan-kondagattu.jpg)
Pawan Kalyan : రేపే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక తొలిసారి తెలంగాణలోని ఆంజనేయస్వామి ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టుకు రాబోతున్నారు.