HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Delhi Politics

Pawan Kalyan: ఢిల్లీ వ్యూహంలో ప‌వ‌న్ ఢ‌మాల్

`చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జ‌రిగింది. ఆయ‌న టైమ్ లోనూ ప్ర‌జాస్వామ్యం లేదు.

  • Author : CS Rao Date : 20-10-2022 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

`చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జ‌రిగింది. ఆయ‌న టైమ్ లోనూ ప్ర‌జాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలంటూ చంద్ర‌బాబు పిలుపు ఇవ్వ‌డాన్ని బీజేపీ త‌ప్పుబ‌డుతోంది` అంటూ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు తాజా రాజ‌కీయా ప‌రిణామాల‌కు కొత్త భాష్యం చెబుతున్నాయి.

జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌రువాత చెప్పిన మాట‌ల‌వి. ఢిల్లీకి ప‌వ‌న్ ను బీజేపీ అగ్ర‌నేత‌లు పిలిచార‌ని బుధ‌వారం మీడియా హ‌ల్ చ‌ల్ చేసింది. ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌ను క‌లుస్తార‌ని జన‌సేన లీకులు ఇచ్చింది. సీన్ క‌ట్ చేస్తే, ఢిల్లీ వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌ర్నీ క‌లిసిన దాఖ‌లాలు లేవు. కేవ‌లం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో మాత్ర‌మే భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Also Read:  TDP vs YCP : బాబాయ్ హ‌త్య కేసులో నైతిక భాధ్య‌త వ‌హిస్తూ జ‌గ‌న్ రాజీనామా చేయాలి – మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌

మూడేళ్లుగా బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఏపీలో ప‌నిచేస్తున్నాయి. కానీ, ఉప ఎన్నిక‌ల్లోనూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డిపోరాటం చేసిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన‌ప్ప‌టికీ డిపాజిట్లు ద‌క్క‌లేదు. ఆ త‌రువాత జ‌రిగిన బ‌ద్వేల్, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు వేర్వేరుగా వ్య‌వ‌హ‌రించాయి. ఎనిమిదో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా మూడు ఆప్ష‌న్లు త‌న‌కు ఉన్నాయ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఆ త‌రువాత నాలుగో ఆప్ష‌న్ కూడా ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది.

బ‌హుశా నాలుగో ఆప్ష‌న్ కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ తో క‌లిసి ప‌నిచేయ‌డం అంటూ ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌ట్లో ఆయ‌న చెప్పిన మూడు ఆప్ష‌న్ల‌లో ఒక‌టి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్ల‌డం ఒక‌టి. రెండోవ‌ది బీజేపీ, జ‌న‌సేన పొత్తుతో వెళ్ల‌డం. ఇక మూడో ఆప్ష‌న్ టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం. నాలుగో ఆప్ష‌న్ కింద ఒంటరిగా జ‌న‌సేన వెళ్ల‌డమ‌ని అప్ప‌ట్లో అనుకున్నారు. కానీ, తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కావ‌డంతో ఆ పార్టీతో జ‌న‌సేన వెళుతుంద‌ని తాజా టాక్‌.

Also Read:  Rahul Gandhi Yatra: యూపీఏలో వైసీపీపై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు

విశాఖ ఘ‌ట‌న త‌రువాత ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయ చిత్రం మారిపోయింది. గ‌ర్జ‌న సంద‌ర్భంగా విశాఖ వెళ్లిన ప‌వ‌న్ ను హోట‌ల్ లో నిర్బంధించారు. దీంతో రెచ్చిపోయిన ఆయ‌న మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ కేంద్రంగా బూతులు తిడుతూ వైసీపీ లీడ‌ర్ల‌పై ద‌మ్మెత్తిపోశారు.అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లయిక చోటుచేసుకుంది. దీంతో టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖ‌య‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, బీజేపీతో క‌టీఫ్ అయిన‌ట్టు ప‌వ‌న్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయ‌న్ను ఢిల్లీకి బీజేపీ పెద్ద‌లు ఆహ్వానించారు.

ప్ర‌స్తుతం ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్ద‌ల‌తో. ప‌వ‌న్ మంత‌నాలు సాగిస్తున్నారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూసిన. ప‌వ‌న్ ఇక ఊడిగం చేయ‌లేనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ పెద్ద‌లు జ‌న‌సేనాని తో భ‌విష్య‌త్ రాజ‌కీయం గురించి ప్ర‌స్తావిస్తార‌ని తెలుస్తోంది. అయితే, జ‌న‌సేన‌, టీడీపీ మాత్రమే క‌లిసి వెళ్లేలా ఢిల్లీ మ్యాప్ ఉంద‌ని తెలుస్తోంది. దానికి ప‌వ‌న్ అంగీకరిస్తారా? లేదా అనేది చూడాలి.

Also Read:   Botsa : పవన్ ను చూస్తే రక్తం మరుగుతోంది..!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP BJP chief
  • delhi politics
  • Pawan Kalyan

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd