HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan And Botsa Satyanarayana War Of Words On Uttarandhra Development

AP Politics : `డేంజ‌ర్` పాలి`ట్రిక్స్` లో ఉత్త‌రాంధ్ర‌

క్ష‌ణ‌క్ష‌ణం అక్క‌డ ఉత్కంఠ‌. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని ఆందోళ‌న‌. ఊపిరి స‌ల్ప‌నంత‌గా గంద‌ర‌గోళం.

  • Author : CS Rao Date : 14-10-2022 - 1:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Botsa
Pawan Botsa

క్ష‌ణ‌క్ష‌ణం అక్క‌డ ఉత్కంఠ‌. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని ఆందోళ‌న‌. ఊపిరి స‌ల్ప‌నంత‌గా గంద‌ర‌గోళం. ఇలాంటి ప‌రిస్థితి ఎక్క‌డో కాదు, ఒక‌ప్పుడు ప్ర‌శాంతంగా ఉండే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో నెల‌కొంది. దానికి కార‌ణం ప్ర‌ధాన పార్టీల నిర్ణ‌యాలు, అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ చేస్తోన్న మ‌హాపాద‌యాత్ర వెర‌సి ఉత్త‌రాంధ్రలో నివురుగ‌ప్పిన నిప్పులా రాజ‌కీయం ఉంది. అక్కడి పోలీసులు నిద్ర‌లేని రాత్రులు గడిపేలా చేస్తోంది,

తెల్ల‌వారితే జ‌న‌సేనాని ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నంకు వెళుతున్నారు. అక్క‌డ ఆ పార్టీ నాయ‌కులు, వ‌లంటీర్ల‌తో భేటీ కానున్నారు. ఆ మేర‌కు ప‌దో తేదీన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా దానికి ప్ర‌చారం పెద్ద ఎత్తున చేశారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ అయింది. స‌రిగ్గా ఈనెల 15వ తేదీన‌ విశాఖ కేంద్రంగా వైసీపీ వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా గ‌ర్జ‌న స‌భ‌ను పెట్టింది. అందుకే, ప‌వ‌న్ షెడ్యూల్ ను మార్చుకోవాల‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ హిత‌వు పలికారు. ప్ర‌తిగా గ‌ర్జ‌న ఎవ‌రికోసం అంటూ ప‌వ‌న్ ట్వీట్ల వ‌ర్షాన్ని కురిపిస్తున్నారు. ఫ‌లితంగా హై టెన్ష‌న్ ఉత్త‌రాంధ్ర కేంద్రంగా నెల‌కొంది.

వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా ఈ నెల 15న విశాఖ గ‌ర్జ‌న పేరిట ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. ఆ రోజున విశాఖ‌లోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి వైఎస్సార్ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించేలా షెడ్యూల్ ఖ‌రారు చేశారు. ఆ ర్యాలీకి స‌మాంత‌రంగా ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేప‌ట్టాల‌ని పిలుపునివ్వ‌డం మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతోంది. మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌వాణిని నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ఉత్త‌రాంధ్ర‌కు చెందిన పార్టీ ముఖ్య నేత‌ల‌తో భేటీ కానున్నారు. జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదంతా తెర వెనుక చంద్రబాబు న‌డిపిస్తోన్న పాలిటిక్స్ గా భావిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దుల్లోకి ఈనెల 15వ తేదీ నాటికి మ‌హాపాద‌యాత్ర కూడా చేరుకుంటుంది. ఇప్ప‌టికే గోదావరి జిల్లాల‌కు చేరిన అమరావ‌తి రైతుల పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి వైసీపీ క్యాడ‌ర్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చేరిన వెంట‌నే వికేంద్ర‌క‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా ఏర్ప‌డిన జేఏసీ అమ‌రావ‌తి రైతుల యాత్ర‌ను డైరెక్టుకు అడ్డుకోవ‌డానికి సిద్ధం అయింది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి మహాపాద‌యాత్ర ఒక వైపు, మూడు రాజ‌ధానుల‌కు అండ‌గా జేఏసీ ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా ర్యాలీలు ఇంకో వైపు ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న వెర‌సి అడుగడుగునా టెన్ష‌న్ నెల‌కొంది.

జ‌న‌సేనాని విశాఖ ప‌ర్య‌ట‌న కోసం ఆ పార్టీ క్యాడ‌ర్ ప్లెక్సీల‌ను ఏర్పాటు చేసింది. వాటిని వికేంద్ర‌క‌ర‌ణ జేఏసీ, వైసీపీ క్యాడ‌ర్ సంయుక్తంగా రాత్రికిరాత్రి తొల‌గించ‌డం జరిగింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రిస్తారా? విశాఖ గ‌ర్జ‌న స‌భ‌ను నిలువ‌రిస్తారా? స‌మాంత‌రంగా రెండింటీని అనుమ‌తిస్తూ అమ‌రావ‌తి మ‌హాపాద‌యాత్ర‌ను ఆపేస్తారా? అనేది సందిగ్ధంగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • botsa sathya narayana
  • janasena party
  • Pawan Kalyan
  • uttarandhra
  • ysrcp

Related News

Deputy CM to arrive in AP today

Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమాన

  • PM Meets Pawan Kalyan family

    Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Varma

    Pithapuram వర్మపై టీడీపీ వేటు

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd