HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan And Botsa Satyanarayana War Of Words On Uttarandhra Development

AP Politics : `డేంజ‌ర్` పాలి`ట్రిక్స్` లో ఉత్త‌రాంధ్ర‌

క్ష‌ణ‌క్ష‌ణం అక్క‌డ ఉత్కంఠ‌. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని ఆందోళ‌న‌. ఊపిరి స‌ల్ప‌నంత‌గా గంద‌ర‌గోళం.

  • Author : CS Rao Date : 14-10-2022 - 1:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Botsa
Pawan Botsa

క్ష‌ణ‌క్ష‌ణం అక్క‌డ ఉత్కంఠ‌. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని ఆందోళ‌న‌. ఊపిరి స‌ల్ప‌నంత‌గా గంద‌ర‌గోళం. ఇలాంటి ప‌రిస్థితి ఎక్క‌డో కాదు, ఒక‌ప్పుడు ప్ర‌శాంతంగా ఉండే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో నెల‌కొంది. దానికి కార‌ణం ప్ర‌ధాన పార్టీల నిర్ణ‌యాలు, అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ చేస్తోన్న మ‌హాపాద‌యాత్ర వెర‌సి ఉత్త‌రాంధ్రలో నివురుగ‌ప్పిన నిప్పులా రాజ‌కీయం ఉంది. అక్కడి పోలీసులు నిద్ర‌లేని రాత్రులు గడిపేలా చేస్తోంది,

తెల్ల‌వారితే జ‌న‌సేనాని ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నంకు వెళుతున్నారు. అక్క‌డ ఆ పార్టీ నాయ‌కులు, వ‌లంటీర్ల‌తో భేటీ కానున్నారు. ఆ మేర‌కు ప‌దో తేదీన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా దానికి ప్ర‌చారం పెద్ద ఎత్తున చేశారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ అయింది. స‌రిగ్గా ఈనెల 15వ తేదీన‌ విశాఖ కేంద్రంగా వైసీపీ వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా గ‌ర్జ‌న స‌భ‌ను పెట్టింది. అందుకే, ప‌వ‌న్ షెడ్యూల్ ను మార్చుకోవాల‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ హిత‌వు పలికారు. ప్ర‌తిగా గ‌ర్జ‌న ఎవ‌రికోసం అంటూ ప‌వ‌న్ ట్వీట్ల వ‌ర్షాన్ని కురిపిస్తున్నారు. ఫ‌లితంగా హై టెన్ష‌న్ ఉత్త‌రాంధ్ర కేంద్రంగా నెల‌కొంది.

వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా ఈ నెల 15న విశాఖ గ‌ర్జ‌న పేరిట ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. ఆ రోజున విశాఖ‌లోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి వైఎస్సార్ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించేలా షెడ్యూల్ ఖ‌రారు చేశారు. ఆ ర్యాలీకి స‌మాంత‌రంగా ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేప‌ట్టాల‌ని పిలుపునివ్వ‌డం మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతోంది. మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌వాణిని నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ఉత్త‌రాంధ్ర‌కు చెందిన పార్టీ ముఖ్య నేత‌ల‌తో భేటీ కానున్నారు. జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదంతా తెర వెనుక చంద్రబాబు న‌డిపిస్తోన్న పాలిటిక్స్ గా భావిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దుల్లోకి ఈనెల 15వ తేదీ నాటికి మ‌హాపాద‌యాత్ర కూడా చేరుకుంటుంది. ఇప్ప‌టికే గోదావరి జిల్లాల‌కు చేరిన అమరావ‌తి రైతుల పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి వైసీపీ క్యాడ‌ర్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చేరిన వెంట‌నే వికేంద్ర‌క‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా ఏర్ప‌డిన జేఏసీ అమ‌రావ‌తి రైతుల యాత్ర‌ను డైరెక్టుకు అడ్డుకోవ‌డానికి సిద్ధం అయింది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి మహాపాద‌యాత్ర ఒక వైపు, మూడు రాజ‌ధానుల‌కు అండ‌గా జేఏసీ ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా ర్యాలీలు ఇంకో వైపు ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న వెర‌సి అడుగడుగునా టెన్ష‌న్ నెల‌కొంది.

జ‌న‌సేనాని విశాఖ ప‌ర్య‌ట‌న కోసం ఆ పార్టీ క్యాడ‌ర్ ప్లెక్సీల‌ను ఏర్పాటు చేసింది. వాటిని వికేంద్ర‌క‌ర‌ణ జేఏసీ, వైసీపీ క్యాడ‌ర్ సంయుక్తంగా రాత్రికిరాత్రి తొల‌గించ‌డం జరిగింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రిస్తారా? విశాఖ గ‌ర్జ‌న స‌భ‌ను నిలువ‌రిస్తారా? స‌మాంత‌రంగా రెండింటీని అనుమ‌తిస్తూ అమ‌రావ‌తి మ‌హాపాద‌యాత్ర‌ను ఆపేస్తారా? అనేది సందిగ్ధంగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • botsa sathya narayana
  • janasena party
  • Pawan Kalyan
  • uttarandhra
  • ysrcp

Related News

We will contest in Telangana — Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నా

  • Sajjala

    YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

  • AP CM Chandrababu

    CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Pawan Kalyan Must Hold a Meeting Only After Apologizing: Minister Ponnam Expresses Anger

    Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

Latest News

  • CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

  • Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

  • AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd