HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pattabhiram Challenges Gautam Sawang

pattabhi : గౌతమ్ సవాంగ్ కు పట్టాభిరామ్ సవాల్

  • Author : Latha Suma Date : 18-03-2024 - 4:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pattabhiram Challenges Gaut
Pattabhiram Challenges Gaut

 

Gautam Sawang : ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షను ఏపీ హైకోర్టు(AP High Court) రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ(tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(pattabhi) మీడియా సమావేశం నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్(gautam sawang) కు లేదని స్పష్టం చేశారు. మా వద్ద ఉన్న ఆధారాలతో వస్తా… మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్ధమా? అని పట్టాభి సవాల్ విసిరారు. తప్పు చేసి కూడా ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ తొలగించకముందే సవాంగ్ రాజీనామా చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు.

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని, వాల్యుయేషన్ తర్వాత కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని పట్టాభి విమర్శించారు. 2022 మార్చి 25 తర్వాతే మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్టు రెండు సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆరోపించారు.

read also: Pothina Mahesh : విజయవాడ లో జనసేన శ్రేణులు నిరసన..పవన్ ఫై ఆగ్రహం

ఓసారి వాల్యుయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని పట్టాభి ప్రశ్నించారు. సీతారామాంజనేయులే రెండోసారి వాల్యుయేషన్ జరపాలని లేఖ రాశారని వెల్లడించారు. రెండోసారి వాల్యుయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారని వివరించారు.

“గ్రూప్-1లో అక్రమాలను ఆధారాలతో సహా చూపిస్తున్నా బుకాయిస్తారా? మాన్యువల్ మూల్యాంకనం చేయించకపోతే హాయ్ ల్యాండ్ వారికి రూ.20 లక్షలు ఎందుకు చెల్లించారు? ఒకసారి వాల్యుయేషన్ చేశారు… మళ్లీ వాల్యుయేషన్ చేయించారు. రెండో పర్యాయం వాల్యుయేషన్ కు రూ.20 లక్షలు చెల్లించారు. స్ట్రాంగ్ రూమ్, డీలక్స్ రూమ్ లు వంటి వాటికి జీఎస్టీతో కలిపి రూ.20,6000 చెల్లించారు” అని పట్టాభి ఆరోపించారు.

read also: Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

బందోబస్తు కోసం కర్నూలు నుంచి వచ్చిన 30 మంది పోలీసులను పిలిచి మాట్లాడదామా గౌతమ్ సవాంగ్? అంటూ సవాల్ విసిరారు. వాల్యుయేషన్ చేయించకపోతే పోలీసులను ఎందుకు పంపారని నిలదీశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APPSC
  • Gautam Sawang
  • Group 1 Mains
  • pattabhi
  • tdp

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd