Yuvagalam : యువగళం ఎఫెక్ట్.. నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ
వచ్చేవారం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభంకాబోతుంది. టీడీపీ అధినేత
- By Prasad Published Date - 10:56 PM, Sun - 24 September 23
వచ్చేవారం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభంకాబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ తన పాదయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు. అయితే న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో నారా లోకేష్ గత వారం రోజులుగా మకాం వేశారు. హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు. రేపు దీనిపై సుప్రీం చీఫ్ జిస్టిస్ విచారణ చేయనున్నారు.అక్కడ కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే వెంటనే బెయిల్ కి పిటిషన్ దాఖలు చేయనున్నారు. బెయిల్ అయితే మరో మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో నారా లోకేష్ కూడా తన పాదయాత్రను ఎక్కడ అయితే ఆపారో అక్కడ నుంచే ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్లో సీనియర్ నేతలకు తెలిపారు.
లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం అవుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. రాజమండ్రి బ్రిడ్జిని నెల రోజుల పాటూ మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. సెంట్రల్ క్యారేజ్వే, వయాడక్ట్ భాగం, రోడ్డు కమ్లోని అప్రోచ్లతోపాటు దెబ్బతిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు రోడ్డు కం రైలు వంతెనపై నెల రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె.మాధవి లత తెలిపారు. ఈ అత్యవసర మరమ్మతుల కోసం ట్రాఫిక్ను మళ్లించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. క్యారేజ్వే పునరుద్ధరణకు దాదాపు 4.5 కిలోమీటర్ల మేర బి.టి. (బ్లాక్ టాప్ రోడ్) వయాడక్ట్ భాగం, అప్రోచ్లతో సహా, సెకండరీ జాయింట్ల వద్ద జియో-గ్లాస్ గ్రిడ్ల ప్రత్యేక మరమ్మత్తు పనులు రూ.210 లక్షలతో పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను పోలీసు, రవాణా శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆమె తెలిపారు. APSRTC బస్సులను కూడా ప్రత్యామ్నాయ రూట్లలో నడపాలని ఆదేశించారు. పాఠశాల బస్సుల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం వంతెనను మూసివేసిన విషయాన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు తెలియజేయాలని డీఈవోను ఆదేశించారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.