AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!
- By Kavya Krishna Published Date - 07:04 PM, Sat - 9 March 24
ఏపీలో జనసేన పరిస్థితి మరింత ఆయోమయంగా తయారవుతోందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై గెలిచేందుకు టీడీపీ- జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. గత రెండు రోజులుగా బీజేపీ హైకమాండ్తో పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో పొత్తులో సీట్ల పంపకాలు జరుగుతోంది. అయితే.. ఇప్పిటికే 24 అసెంబ్లీ స్థానాలు.. 3 లోక్ సభ స్థానాలతో నిరాశలో ఉన్న జనసైనికులకు మరో నిరుత్సాహపరిచే వార్త ఇప్పుడు మీడియాలో తిరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకం పూర్తయిందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని అంటున్నారు. జనసేన గతంలో కేటాయించిన మూడు లోక్ సభ స్థానాల నుంచి ఒక లోక్ సభ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ తర్వాత టీడీపీ (145, 17), జనసేన (24, 2), బీజేపీ (6,6) స్థానాల్లో లెక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం నిజమైతే ఇది జనసేనకు తీరని అన్యాయమనే చెప్పాలి.
We’re now on WhatsApp. Click to Join.</a
ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడం, అది కూడా జనసేన నుంచి తిరిగి సీటు తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కలిసివచ్చే విషయమేమి కాదు. సీట్ల పంపకాలపై ఇప్పటికే జనసేన కేడర్లో నిరాశ నెలకొంది. ఇది వారిని మరింత నిరాశకు గురి చేస్తుంది. జనసేన, బీజేపీ మధ్య లావాదేవీ జరిగినా.. టీడీపీని మాత్రం జనసైనికులు తప్పుబడతారు. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరగడం మంచిది కాదు. అనకాపల్లి సీటును బీజేపీకి జనసేన త్యాగం చేయబోతోందని అంటున్నారు. తొలుత ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేయగా, ఆయన వెనక్కి తగ్గడంతో కొణతాల రామకృష్ణ అక్కడి నుంచి పోటీ చేశారు.
Read Also : Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?
Related News
Narendra Modi : ‘ధాకడ్’ ప్రభుత్వం కారణంగా ఇప్పుడు భారతదేశ శత్రువులు వణుకుతున్నారు
కేంద్రంలో 'ధాకడ్' (ధైర్యమైన) ప్రభుత్వం ఉన్నందున ఏదైనా చేయాలనే ఆలోచన చేసే ముందు భారత శత్రువులు ఇప్పుడు వందసార్లు ఆలోచించారని పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు.