HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Notices To Srm University Hearing On 24th Of This Month

SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-11-2025 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srm
Srm

అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్‌ సెస్‌ పెండింగ్‌ ఉన్నాయి.. అయితే SRM యూనివర్శిటీ లేబర్‌ సెస్‌ చెల్లించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 24న విచారణకు రావాలంటూ SRM వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌కు కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ కూడా చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయట. కార్మికశాఖ SRM యూనివర్శిటీకి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఆ వెంటనే విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఈ ఘటనతో విద్యార్థులు ఆరోగ్యంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూడా యూనివర్సిటీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆందోళనలకు అసలు కారణాలను తెలుసుకోవడానికి, ప్రభుత్వం ఒక అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో ఈ కమిటీని నియమించారు.

ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 300 మందికి పైగా విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలో, కమిటీ పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. ఫుడ్, వాటర్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. నీటి శుద్ధి ప్రక్రియపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతోనూ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు ఈ నెల 7 నుంచి 23 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, యూనివర్సిటీ మొత్తం శానిటేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్, మెస్, తరగతి గదుల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ పరిణామాల తర్వాత వర్శిటీకి కార్మికశాఖ నుంచి నోటీసులు వచ్చాయి.. ఈ అంశంపై వర్శిటీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Labour Department Commission Notice
  • srm university

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

  • Cbn Sha

    అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

  • Amaravati

    అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

Latest News

  • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

  • భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..

  • ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో ఊరట

  • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd