Chandrababu : చంద్రబాబుకు మద్దతు తెలిపిన ముస్లిం లా బోర్డు
- By Latha Suma Published Date - 03:01 PM, Wed - 8 May 24

Chandrababu:ఏపిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కీలక పరిమణాలు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్టు(South Indian Muslim Personal Law Board) సభ్యులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా టీడీపీకి సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు టీడీపీకి మద్ధుతుగా నిలిచిందని గుర్తుచేశారు. సెక్యులరిజానికి చంద్రబాబు ఐకాన్గా నిలిచారన్నారు. మత సామర్యాన్ని కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
Read Also:Warmest April : ‘ఏప్రిల్’ ఫుల్.. రికార్డులు బద్దలుకొట్టిన టెంపరేచర్స్
సామాజిక సమతుల్యాన్ని చంద్రబాబు ఎల్లప్పుడూ పాటిస్తున్నారని తెలిపారు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాలు అభివృద్ధికి సాధ్యమని వెల్లడించారు. ముస్లీంల అభివృద్ధికి తోడ్పడే మేనిఫోస్టోని ప్రకటించిన టీడీపీకి అభినందనలు తెలియజేశారు. లాల్ జాన్ భాషా వంటి నాయకులను రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీది అని తెలిపారు. టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు తమ ఆర్గనైజేషన్ ద్వారా సాయశక్తుల కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముస్లిం… సోదర సోదరీమణులు టీడీపీకి ఓటు వేయాలని రాషిద్ షరీఫ్ పిలుపునిచ్చారు.