Murder : పల్నాడు జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో చిన్న చిన్న గొడవలతో ఒకే
- By Prasad Published Date - 07:47 AM, Fri - 24 November 23
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో చిన్న చిన్న గొడవలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మృతులు అనంత్ నరేష్ (32), అతని తల్లిదండ్రులు అనంత్ సాంబశివరావు (63), అనంత్ ఆదిలక్ష్మి (60)గా పిడుగురాళ్ల పోలీసులు గుర్తించారు. ఆరేళ్ల క్రితం సత్తెనపల్లికి చెందిన తన మొదటి భార్య బోయ్యలశెట్టి ప్రియాంకకు అనంత్ నరేష్ విడాకులు ఇచ్చి ముప్పాళ్ల మండలం దమ్మాలపాటి గ్రామానికి చెందిన దొమ్మా మాధురిని వివాహం చేసుకున్నాడు. నరేష్ తన 15 ఎకరాల భూమిలో వ్యవసాయ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నరేష్ రెండవ భార్య మాధురి కూడా అతనితో పాటు పనికి వెళ్లేది.వీరికి ఆరేళ్ల బాలుడు వేణు గోపాల్ ఉన్నాడు. అయితే బుధవారం మాధురి కడుపునొప్పితో బాధపడుతుందని, పనికి వెళ్లడం ఇష్టం లేదని, తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని భర్తను కోరింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సమయంలో భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదేరోజు రాత్రి మాధురి తన సోదరుడు దొమ్మా శ్రీనివాసరావుకు, తండ్రి సుబ్బారావుకు ఫోన్ చేసి జరిగిన గోడవ గురించి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మాధురి తండ్రి, సోదరుడు కత్తి పట్టుకుని ఆమె ఇంటికి చేరుకున్నారు. మాధురి అత్తమామలు సాంబశివరావు, ఆది లక్ష్మి సమక్షంలో మాధురిని ఇబ్బంది పెట్టిన విషయం గురించి ఆరా తీస్తుండగా నరేష్ మాధురి మెడ పట్టుకుని మళ్లీ గొడవకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు తన తండ్రి సుబ్బారావులు.. అల్లుడు నరేష్, అత్తామామలు సాంబశివరావు, ఆదిలక్ష్మిలను కత్తితో పొడిచి చంపాడు. హత్య అనంతరం ఇద్దరు ముప్పాళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Harassment : కర్ణాటకలో దారుణం.. భార్య ప్రవేట్ పార్ట్స్పై యాసిడ్ పోసిన భర్త
Related News
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.