RK Roja: అపోలో ఆస్పత్రిలో చేరిన మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆమె కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 01:59 PM, Sun - 11 June 23
RK Roja: ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆమె కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్నీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మంత్రి రోజా కాలు బెణకడంతో కొంత కాలంగా ఆమె ఫిజియో చికిత్స తీసుకున్నారు. అయితే ఈ మధ్య నొప్పి ఎక్కువ అవ్వడంతో రోజాను కుటుంబ సభ్యులు చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉండనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పది రోజులు ఆమె తన నగరి నియోజకవర్గానికి దూరంగా ఉండనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Read More: Tiktoker-Death : టిక్టాక్ ‘స్కార్ఫ్ గేమ్’ కు బాలిక బలి
Related News
Chennai: భారతదేశంలో నిషేదించిన కుక్కలు..చిన్నారిని కరిచిన రోట్వీలర్
చెన్నైలో లైసెన్స్ లేకుండా రాట్వీలర్ కుక్కను పెంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని అయల్ లాంటమ్ మోడల్ స్కూల్ రోడ్లోని ఓ పార్కులో 5 ఏళ్ల బాలికను రెండు రోట్వీలర్ పెంపుడు కుక్కలు కరిచాయి. బాలిక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.