AP: అసలు మీరు కోడిగుడ్ల బిల్లులు కట్టారా? వైసీపీ కట్టింది..వాస్తవాలు మాట్లాడండి..!!
- By hashtagu Published Date - 07:04 PM, Wed - 2 November 22
పూర్తి వివరాలు తెలియకుంటే…తెలుసుకుని మాట్లాడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అసలు మీ హయాంలో కోడిగుడ్ల బిల్లులు చెల్లించారా? చరిత్రలో లేని అప్పులు చేసింది టీడీపీ. వాటన్నింటిని వైసీపీ చెల్లిస్తోందంటూ మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు కూడా చెల్లించలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ బకాయిపెట్టిన రూ. 774కోట్లను వైసీపీ ప్రభుత్వం చెల్లించదన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించామన్నారు. రూ. 1785కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ కూడా తమ ప్రభుత్వమే చెల్లిందని స్పష్టం చేశారు. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ అంచనా వేసేందుకు స్మార్ట్ మీటర్ల పెట్టామని తెలిపిన బుగ్గన…20శాతం వరకు విద్యుత్ నష్టాల కింద విద్యుత్ సంస్థలు రాస్తున్నాయన్నారు. ఉచిత విద్యుత్ ను కూడా ఇదే ఖాతాలో చేర్చుతున్నారన్న ఉద్దేశ్యంతోనే ఈ స్మార్ట్ మీటర్లను తెస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ తప్పుడు కోణంలో చూస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 19.55శాతం ఉంటే…వైసీపీ హయాంలో కేవలం 15శాతం మాత్రమే అన్నారు. రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా తొలగించలేదన్నారు. యనమల ముందు తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించాలని కోరుతున్నామని సెటైర్లు వేశారు బుగ్గన.
Related News
CM Jagan Graph: పులివెందులలో జగన్ గ్రాఫ్ ఢమాల్.. 2019-2024 మధ్య తేడా ఇదే..
పులివెందుల అంటే వైఎస్సార్ కుటుంబం. ప్రత్యర్థి పార్టీలు సైతం ఒప్పుకుంటాయి. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వైఎస్సార్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆనాటి వైఎస్ రాజారెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకు పులివెందుల నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు.