Lokesh vs Jagan: పిచ్చోడి చేతిలో ఆంధ్రప్రదేశ్
స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార పార్టీ వైసీపీ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఇష్యూలో చంద్రబాబు అరెస్ట్ అయి 24రోజులు అవుతుంది.
- By Praveen Aluthuru Published Date - 02:07 PM, Tue - 3 October 23
Lokesh vs Jagan: స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార పార్టీ వైసీపీ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఇష్యూలో చంద్రబాబు అరెస్ట్ అయి 24రోజులు అవుతుంది. ఇక నారా లోకేష్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాములో చంద్రబాబును ముద్దాయిగా చేర్చగా, ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా లోకేష్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చింది. దీంతో నారా లోకేశ్ అక్టోబర్ 4వ తేదీ అంటే రేపు బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇది రాజకీయ కక్షపూరిత చర్యగా భావిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ ఢిల్లీలోని లోధీ ఎస్టేట్లో నారా లోకేష్, పార్టీ మద్దతుదారులు సోమవారం నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడును విడుదల చేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ‘ఐ యామ్ విత్ సీబీఎన్’ పోస్టర్లు పట్టుకుని సంఘీభావం తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ఒక పిచ్చివాడు సిఎం అయ్యాడని హాట్ కామెంట్స్ చేశాడు లోకేష్. రాజకీయ నిబద్ధత కలిగిన చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. ఇది ముమ్మాటికీ రాజకీయ పోకడే తప్ప మరొకటి కాదన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించినా మరో రెండు కేసులలో అతన్ని మళ్లీ రిమాండ్లో ఉంచవచ్చుని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనపై కూడా తప్పుడు కేసులు పెడుతుందని, తన భార్యను, తల్లిని కూడా జైల్లో పెడతానని బెదిరింపులకు గురిచేస్తోందన్నారు.ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పిచ్చి పరిపాలన సాగుతోంది అని నారా లోకేశ్ మండిపడ్డారు.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ( CID) సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది.
Also Read: BMW X2 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో అదిరిపోయే కారు.. ఫీచర్లు ఇవే..!
Tags
Related News
Nara Lokesh: ఏపీ సంక్షేమం కోసమే ప్రజాగళం కూటమి ఏర్పాటు
Nara Lokesh ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో కూటమి ఆధ్వర్యాన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలిసి యువనేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తిరుపతి అంటే అమర్ రాజా, అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ ప్లాంట్ ను ఏర్పాటుచేసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇక్కడ 20వేల మంది ఉద్యోగాలు కో�