SV Zoological Park : తిరుపతి జూలో వ్యక్తిని చంపేసిన సింహం
- By Sudheer Published Date - 05:19 PM, Thu - 15 February 24
తిరుపతి ఎస్వీ జూ (SV Zoological Park)లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జూ సందర్శనకు వచ్చిన రాజస్థాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జార్ సెల్ఫీ కోసం లయన్ ఎన్ క్లోజర్లోకి దూకాడు. అక్కడ సింహాన్ని చూసి తొడగొట్టడం..దానిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేసాడు. దీంతో ఆగ్రహం తో సింహం ఒక్కసారిగా అతడిపైకి దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు అతడు చెట్టెక్కేందుకు ప్రయత్నించాడు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ సింహం అతడిపై దాడి (Lions Kills Man) చేసింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తి జూకు ఒకడే వచ్చినట్లుగా భావిస్తున్నారు. అలాగే మద్యం మత్తులో ఉన్నట్లు జూ సిబ్బంది చెపుతున్నారు. జూ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. చనిపోయిన వ్యక్తి శవాన్ని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. గతంలో ఢిల్లీ లో కూడా ఇలాటి ఘటనే చోటుచేసుకుంది. పులి జోన్ లోకి దూకడం తో ఆ వ్యక్తి ఫై దాడి చేసి చంపేసింది.
Read Also : Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు
Related News
Jhanvi Kapoor: అందుకే తిరుమల శ్రీవారి పై అంత భక్తి.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన జాన్వీకపూర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్