HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Laddu Controversy Cm Chandrababu Welcomed The Supreme Court Verdict

CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu : సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.

  • Author : Latha Suma Date : 04-10-2024 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Laddu controversy.. CM Chandrababu welcomed the Supreme Court verdict
Ratan Tata Innovation Hub in Amaravati: CM Chandrababu

Supreme Court :తిరుమల శ్రీవారి లడ్డూ ఘటన విచారణ పై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర విచారణ కోసం అయిదుగురు సభ్యులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐతో పాటుగా ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ఈ టీంకు సీబీఐ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారు. సుప్రీంకోర్టు నిర్ణయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదనేది తమ అభిప్రాయంగా వెల్లడించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.

Read Also: Sanātana Dharma : పవన్ కామెంట్స్ కు డిప్యూటీ సీఎం స్టాలిన్ రియాక్షన్

తిరుమల లడ్డూ వివాదం పైన సుప్రీం కోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. లడ్డూ వివాదం పైన స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని సుబ్రమణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డితో పాటుగా మరి కొందరు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం విచారణతో సిట్ విచారణ నిలిపివేసింది. కేంద్రం అభిప్రాయం కోరగా..కేంద్రం పర్యవేక్షణలో విచారణ జరిగాలని కోరుకుంటున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.

దీంతో, సుప్రీంకోర్టు న్యాయస్థానం కొత్తగా సిట్ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఇదే సమయంలో ఎవరూ లడ్డూ వివాదం పైన రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని తీర్పు వెలువరించింది. భక్తుల మనోభావాలకు చెందిన విషయం అయినందున దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ చెప్పుకొచ్చారు.

Read Also: Actor Mohan Raj Passes Away: అరుదైన వ్యాధితో మలయాళ నటుడు మోహన్ రాజ్(70) మృతి

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • SIT
  • SIT Investigation
  • Supreme Court
  • tirumala laddu controversy

Related News

Telangana Cm Revanth Reddy

CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

2016 నాటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ (Quash) తీర్పునిచ్చింది.

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd