CM Jagan : విజయనగరం రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ
విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించి, ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు
- By Sudheer Published Date - 03:15 PM, Mon - 30 October 23

ఆదివారం విజయనగరం (Vizianagaram Train Accident) జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం-పలాస రైలు చినరావుపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగగా.. ఇదే క్రమంలో వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ – పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 15 మంది మరణించగా (15 Dies) ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం.
ఈ ప్రమాద ఘటన ఫై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్..కొద్దీ సేపటి క్రితం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించి, ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ముందుగా రైలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని , ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించాలని అనుకున్నారు. కానీ ఘటన స్థలానికి వెళ్లకుండా..నేరుగా ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రుల వద్దకు వచ్చారు.
ఈ ఘటన పట్ల ప్రధాని మోడీ (PM Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ప్రధాని మోడీ మాట్లాడారు.మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే సీఎం జగన్ (CM Jagan)సైతం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడమే కాకుండా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది సర్కార్.
Read Also : Kotha Prabhakar Reddy : దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఫై దాడి చేసింది ఓ విలేఖరి