Jaahnavi Kandula: కందుల జాహ్నవి మృతి కేసుపై సీఎం జగన్ ఆరా
అమెరికాలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతిపై సీఎం జగన్ స్పందించారు. ఆమె అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మూర్తి చెందింది.
- Author : Praveen Aluthuru
Date : 14-09-2023 - 11:49 IST
Published By : Hashtagu Telugu Desk
Jaahnavi Kandula: అమెరికాలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతిపై సీఎం జగన్ స్పందించారు. ఆమె అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ కేసులో జోక్యం చేసుకుని కమ్యూనికేట్ చేయాలని కోరుతూ సీఎం జగన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు. నిజానిజాలను వెలికితీసి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.జనవరి 23 2023న పోలీసు కారును ఢీకొట్టిన ప్రమాదంలో 23 ఏళ్ల విద్యార్థిని జాహ్నవి మరణించింది. జాహ్నవి సీటెల్ క్యాంపస్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ చేస్తున్నది. జాహ్నవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని.
Also Read: CM Jagan: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ : సీఎం జగన్