HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Master Plan Of Vijayawada Mp Seat

Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?

జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకోవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్

  • Author : Sudheer Date : 29-08-2023 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Plan
Jagan Plan

గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయకేతనం ఎగరవేసిన జగన్ (Jagan)..ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోకతప్పదని సర్వేలు చెపుతున్నాయి. బయటకు 175 కి 175 కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం 75 అయినా కొట్టగలమా..అని నేతలు మాట్లాడుకుంటున్న సందర్భం లేకపోలేదు. గత ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy Son) కొడుకు కు ఒక్క ఛాన్స్ ఇద్దామని ప్రజలంతా ఏకమై ఓటు వేశారు. కానీ ఇప్పుడు ఆలా కాదు జగన్ కు ఎందుకు వేసామో అని అనుకుంటున్నా వారు కూడా ఉన్నారు. మరోపక్క ఈసారి జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ , జనసేన , బిజెపి (TDP Janasena BJP Alliance) లు ఏకమయ్యాయి. వీరి పొత్తులపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ..లోలోపల మాత్రం వీరి పొత్తు ఓకే అయ్యింది.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతూ ప్రజల్లో మార్పు తెస్తున్నారు. ఈ క్రమంలో జగన్ మాస్టర్ ప్లాన్ (Jagan Master Plan) చేసినట్లు తెలుస్తుంది. రాజకీయాలకు కంచుకోటగా అని పిలువబడే విజయవాడ ఎంపీ స్థానానికి (YCP Vijayawada MP Seat) ఓ ఎస్సీ అభ్యర్థి (SC Candidate) ని నిలబెట్టాలని జగన్ చూస్తున్నాడట. ఇప్పటికే ఆ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం. విజయవాడ (Vijayawada ) అంటే చాలా డిమాండ్ ఉన్న సీటు. రాజకీయాల్లో అరుతేరిన పెద్ద పెద్ద వ్యక్తులెందరో అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం సీఎం వద్ద క్యూ కడుతుంటారు. అలాంటి డిమాండ్ ఉన్న సీటుకు ఓ ఎస్సీ అభ్యర్థి ని నిలబెట్టాలని జగన్ చూస్తుండడం తో ఓ సంచలనమే అని చెప్పాలి.

Read Also : CBN Happy : చంద్ర‌బాబుకు మ‌మ‌త వ్యాఖ్య‌ల‌ జోష్

మాములుగా విజయవాడ లో ఎక్కువగా కమ్మ కులం (Kamma Caste) వారే ఉంటారు. దాదాపు 40 ఏళ్లుగా విజయవాడ స్థానంలో కమ్మ కులస్తులే నిలుస్తూ..గెలుపొందుతూ వస్తున్నారు. కాంగ్రెస్ , టీడీపీ , జనసేన , బీజేపీ ఇలా ఎన్నిపార్టీలు ఇక్కడ పోటీ చేసిన వారంతా కూడా కమ్మ వారినే నిల్చుబెడుతూ వస్తున్నారు. అందుకే విజయవాడ ఎంపీ సీటు అనే అది కమ్మ సీటు అని అంత మాట్లాడుకుంటుంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో కూడిన పశ్చిమ కృష్ణలో కమ్మ, బందరుతో కూడిన తూర్పు కృష్ణలో కాపు జనాభా, రాజకీయ ప్రాబల్యం ఎక్కువ. కాబట్టి ఈసీట్లను ఆ కులాలకే కేటాయిస్తూ వస్తున్నారు. బందరులో మార్పులు జరిగాయి కానీ.. విజయవాడ మాత్రం 40ఏళ్లుగా అదే కొనసాగుతోంది. అలాంటి ఆనవాయితీకి జగన్ బ్రేక్ వేయబోతున్నట్లు తెలుస్తుంది.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో కమ్మ కులం ఈ సారి జగన్ వెంట నిలువడం కష్టమే అని సర్వేలు చెపుతున్నాయి. టీడీపీ- వైసీపీ (TDP-YCP) ఇద్దరు కమ్మ అభ్యర్థులనే పెడితే కచ్చితంగా ప్రజలు టీడీపీకే ఓటు వేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఒక ఎస్సీని నిలబెడితే… ఒక జనరల్ స్థానంలో రిజర్వ్డుడ్ అభ్యర్థిని నిలబెట్టిన క్రెడిట్ వైసీపీకి వస్తుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ జనాభా ఎక్కువ. నందిగామ, తిరువూరు రిజర్వుడ్ సీట్లు రెండు ఉన్నాయి. జగ్గయ్యపేటలో కూడా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో విజయవాడ నగరంలో ఎస్సీ జనాభా చాలా ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. దీంతో విజయవాడ లో ఓ ఎస్సి అభ్యర్థిని నిలబెడితే వారికే ఓటు వేస్తారని..ఒక జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకోవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఓ ఎస్సి అభ్యర్థి కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరి జగన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jagan Master Plan
  • Kamma Caste
  • SC Candidate
  • TDP. YCP
  • vijayawada
  • YCP Vijayawada MP Seat

Related News

Indrakeeladri

Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

  • Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd