AP Schemes: విద్యతోనే మహిళా సాధికారత
బాలికా విద్యను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు.
- By Hashtag U Published Date - 11:21 PM, Fri - 30 September 22
బాలికా విద్యను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిష్ఠాత్మక పథకం కల్యాణమస్తు, షాదీ తోఫాలను ప్రారంభించారు. వాటికి ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ పెళ్లి కానుకను అందుకోవాలంటే అమ్మాయి కనీసం పదో తరగతి చదివి ఉండాలన్న నిబంధనను విధించారు. పాఠశాలల్లో బాలికల శాతాన్ని పెంచేందుకు వీలుగా ఈ నిబంధనను చేర్చారు.
ఈ పథకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పథకానికి అర్హత సాధించాలంటే వధువుతో పాటు వరుడు కూడాకనీసం పదో తరగతి దాకా చదువుకుని ఉండాలి. అంతేగాకుండా వధువు వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలన్న షరతునూ విధించారు.
ఇదీ ప్రభుత్వం అందించే సాయం…
– ఎస్సీలకు రూ.1,00,000
– కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ.1,20,000
– ఎస్టీలకు రూ.1,00,000
– కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు రూ.1,20,000
– బీసీలకు రూ.50,000
– కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.75,000
– మైనారిటీలకు రూ.1,00,000
– దివ్యాంగులకు రూ.1,50,000
– నిర్మాణ కూలీలకు రూ.40,000
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం పేదింటి ఆడపిల్లలకు ఇచ్చే పెళ్లి కానుకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగు ఇది.
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించిన సీఎం. పిల్లలు కచ్చితంగా చదువుకునేందుకు, బాల్య వివాహాలు నిరోధించేందుకు ఈ పథకం తోడ్పడుతుందన్న ముఖ్యమంత్రి. ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫాలను పంపిణీచేస్తామన్న సీఎం. 1/2 pic.twitter.com/NICt2suqDK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 30, 2022
Tags
Related News
AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్న�