Increase Working Hours : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు
Increase Working Hours : అంతేకాకుండా రాత్రి పూట డ్యూటీ చేసే మహిళలకు యజమానులు తప్పనిసరిగా ట్రావెల్ సదుపాయాన్ని, భద్రతా ఏర్పాట్లను కల్పించాలని నిబంధించారు. ఈ సవరణల వల్ల ఒకవైపు కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెబుతుండగా,
- Author : Sudheer
Date : 20-09-2025 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించిన సవరణ బిల్లులు రాష్ట్ర కార్మిక చట్టాల్లో ముఖ్యమైన మార్పులకు దారితీశాయి. ఇప్పటివరకు షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో రోజుకు 8 గంటలపాటు మాత్రమే ఉద్యోగులను పని (Working Hours) చేయించడం చట్టబద్ధం కాగా, ఈ సవరణలతో రోజువారీ పని గంటలను 10 గంటలకు పెంచారు. అయితే వారానికి 48 గంటల గరిష్ట పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే, కంపెనీలు నాలుగు రోజులపాటు 10 గంటలు, మరిన్ని రోజుల్లో తక్కువ గంటలు పని చేయించే విధానాన్ని అనుసరించవచ్చు. దీనివల్ల కార్మికులకు విశ్రాంతి దినాలను వేర్వేరుగా కేటాయించే అవకాశం కలుగుతుంది.
Compassionate Appointments : 2,569 మందికి కారుణ్య నియామకాలు – లోకేశ్
ఫ్యాక్టరీల్లో మొత్తం పని గంటలను బ్రేక్ టైమ్తో కలిపి రోజుకు 12 గంటలు మించకుండా నిబంధనలను కఠినతరం చేశారు. అలాగే ప్రతి ఆరు గంటలకోసారి ఉద్యోగులకు తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలని చట్టబద్ధం చేశారు. ఈ నిబంధనలు కార్మికుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయాలుగా భావించవచ్చు. మరోవైపు, మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చారు. రాత్రి పూట (రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు) మహిళలు పని చేయాలంటే వారి స్వచ్చంద అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేశారు.
అంతేకాకుండా రాత్రి పూట డ్యూటీ చేసే మహిళలకు యజమానులు తప్పనిసరిగా ట్రావెల్ సదుపాయాన్ని, భద్రతా ఏర్పాట్లను కల్పించాలని నిబంధించారు. ఈ సవరణల వల్ల ఒకవైపు కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెబుతుండగా, మరోవైపు కార్మికులపై పని ఒత్తిడి పెరిగే అవకాశముందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే చట్టంలో ఉన్న విశ్రాంతి, భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తే ఉద్యోగులకు పెద్దగా నష్టమేమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సవరణలు ఉద్యోగ మార్కెట్లో వశ్యత (flexibility) పెంచుతూనే, కార్మిక హక్కులను కాపాడే ప్రయత్నమని చెప్పవచ్చు.