HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Illegal Mining Common In Assigned Lands In Ap

అప్పుడు-ఇప్పుడు.. అసైన్డ్ భూమూల్లో అక్రమ మైనింగ్ కామన్!

అక్రమ మైనింగ్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది.

  • Author : Balu J Date : 24-10-2021 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

అక్రమ మైనింగ్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది. గత టీడీపీ హాయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగింది. అటవీ సంపద దోపీడిపై గత ప్రభుత్వ హాయంలో మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించినప్పటికి ఫలితంలేకపోవడంతో… అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేశారు.ఆ తరువాత కొన్ని రోజులు మన్యంలో అక్రమ మైనింగ్ తగ్గినప్పటికీ మళ్లీ యధామాములుగానే
కొనసాగుతుంది.

ఏపీలో నాడు చంద్రబాబు హాయంలో జరిగిన అక్రమ మైనింగ్ నేడు వైఎస్ జగన్ సర్కార్లో కూడా జరుగుతుంది. దళితుల అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పడాల కుమారి అనే దళిత మహిళకు ఎకరా 35 సెంట్లు భూమి ఉంది. ఈ భూమి తన తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా ఆమెకు దక్కింది. అయితే ఈ భూమిని కౌలుకు ఇచ్చిన వ్యక్తితో మైనింగ్ కాంట్రాక్టర్లు ఒప్పుదం చేసుకుని తన భూమిని తవ్వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి ద్వారా తనకు ఏడాదికి రూ.40 నుంచి 50వేల వరకు ఆదాయం వస్తుందిని…మైనింగ్‌ని చాలా సార్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమపైనే దాడికి పాల్పడ్డారని పడాల కుమారి ఆరోపించారు.నాడు తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో ఆ పార్టీ నాయకులు అక్రమంగా మైనింగ్ చేశారని..నేడు వైసీపీ నాయకులు తన భూమిని తవ్వేసుకుంటున్నారన్నారు. ఇదే విషయాన్ని నేరుగా జిల్లా ఎస్పీని,ఆర్డీవోని కలిసి ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని వాపోయారు.

ఈ భూముల్లో మైనింగ్ తవ్వకాలు ఎనిమిదేళ్ల క్రితం టీడీపీ హాయాంలో మొదలైయ్యాయి. అప్పట్లో దీనిని వైసీపీ అక్రమ మైనింగ్ అంటూ తప్పుపట్టింది. సీపీఎంతో సహా ఇతర ప్రజాసంఘాలు ఆందోళనలు సైతం చేశాయి.దీంతో నాడు అక్రమ తవ్వకాలపై అధికారులు కొరఢా ఝులిపించారు.అయినప్పటికి మైనింగ్ కొనసాగుతూనే ఉంది.తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న రామేశంపేట, ఆనూరు, వాలు తిమ్మాపురం, సూరంపాలెం గ్రామాల పరిధిలో సహాజసిద్దంగా ఉన్న మెట్ట ప్రాంతాలు ఇప్పుడు సగానికిపైగా మాయమైయ్యాయి. ఇంధిరాగాంధీ హాయాంలో ఆ మెట్ట ప్రాంతాల్లో సాగు చేసుకునేందుకు సమీప గ్రామాల్లో దళితులకు, ఆదివాసీలకు చెందిన 800 కుటుంబాలకు పట్టాలిచ్చారు. ఎకరా 35 సెంట్లు చొప్పున అసైన్డ్ భూములు వారికి అప్పగించారు. అప్పటి నుంచి మెట్ట భూములను సాగులోకి తెచ్చి జీడి, మామిడి తోటలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఏడేళ్ల క్రితం 100 ఎకరాల్లో మెస్సర్స్ శ్రీ సత్యా మైనింగ్ అండ్ మల్టి పర్పస్ వూక్ సొసైటీ లిమిటెడ్ అనే సంస్థ తరుపున మైనింగ్కి అనుమతి కోరారు. అటవీ, భూగర్భ గనులు, పర్యావరణ, రెవెన్యూ శాఖల పరిశీలన తర్వాత 64.075 ఎకరాలలో గ్రావెల్ తవ్వకాలకు అధికారిక అనుమతులు వచ్చాయి. కానీ 2015 నుంచి ఇప్పటి వరకూ జరిపిన తవ్వకాలు పరిశీలిస్తే దాదాపుగా 300 ఎకరాల పైబడి తవ్వేసినట్టు కనిపిస్తోంది. అంటే అనుమతులున్న దానికి ఐదారు రెట్లు మెట్టను తవ్వేసినట్టు చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ కంపెనీ ఇక్కడ తవ్వకాలు జరపట్లేదు.

దళితులకు జీవనోపాధి కోసం ఇచ్చిన అసైన్డ్ భూములవి. అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 9/77 ప్రకారం వాటిని అమ్మడం, కొనడం చట్టవిరుద్ధం. కానీ జిఒ 2/2013ను చూపించి లీజు పేరుతో తవ్వకాలకు అనుమతిచ్చారు. ఎస్సీలకు చెందిన అసైన్డ్ ల్యాండ్స్ ను కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీనిపై కొందరు కోర్టుకి కూడా వెళ్లారు. సాగుదారుల అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం పట్ల ఇన్జన్క్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయినా గ్రావెల్ తరలింపు ఆపలేదు. గ్రావెల్ పేరుతో 50 అడుగుల ఎత్తులో ఉండే కొండలను తవ్వేశారు. భూమిలో కూడా మరో పది అడుగుల లోతు వరకూ తవ్వకాలు జరిపి చెరువుల్లా మార్చేశారు. కొండల స్థానంలో ఇప్పుడు చెరువులు కనిపిస్తున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారని రామేశంపేట కు చెందిన దళితులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విచ్చల విడిగా అక్రమమైనింగ్ జరుగుతున్న అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు . ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి దళితుల అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్కి అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని వారు కొరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • chandrababu naidu
  • cm jagan
  • mining

Related News

Chandrababu Naidu

Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాలు మహిళా బిల్లు విషయంలో చేసిన ద్రోహాన్ని ఎండగడతామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం మరియు ఎన్డీయే కూటమి ప్రధాన అజెండా అని, బిల్లు వీగిపోయినా తమ పోరాటం ఆగదని స్పష్టం

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

  • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

  • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

  • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd