HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Human Error Was The Cause Of The Fatal Train Accident In Vijayanagaram

Human Error : ఆ రైలు లోకోపైలట్ సిగ్నల్ జంప్ వల్లే ప్రమాదం ?!

Human Error : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద కారణంపై కీలక విషయం వెలుగుచూసింది.

  • By Pasha Published Date - 11:56 AM, Mon - 30 October 23
  • daily-hunt
Train Accident Photos3
Train Accident Photos3

Human Error : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద కారణంపై కీలక విషయం వెలుగుచూసింది. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. రైల్వే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఫెయిల్ కాలేదని తేల్చి చెప్పారు. విశాఖ – రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ సిగ్నల్‌ను చూడకుండా.. దాన్ని దాటుకొని వేగంగా వెళ్లినందు వల్లే  ఈ ప్రమాదం జరిగిందన్నారు. విచారణలో పూర్తి వివరాలు బయటికి వస్తాయని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

పలాస ప్యాసింజర్ ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుకనే రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య కారణంగానే నెమ్మదిగా వెళ్లిందని.. ఇంతలోనే వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ వచ్చి ఢీకొట్టిందని అంటున్నారు.  విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్ పై ఉన్న విశాఖ – పలాస (08532) రైలును.. వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో బయలుదేరిన విశాఖ – రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది తెలియాల్సి ఉంది.  848 కి.మీ వద్ద ట్రాక్ పై నిలబడిన పలాస ప్యాసింజర్‌‌ను వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. దీంతో అక్కడే మరో ట్రాక్ పై ఉన్న గూడ్స్ రైలుపైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మరికొన్ని పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో మొత్తం 1400 మంది ప్రయాణికులున్నట్లు (Human Error) తెలుస్తోంది.

Also Read: Vijay Devarakonda: యూత్ పెద్ద కలలు కనాలి, విజయం సాధించాలి : విజయ్ దేవరకొండ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fatal Train Accident
  • human error
  • vijayanagaram
  • Vizianagaram Train Accident

Related News

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd