HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Government Working On Changing Districts In Ap Possibility Of Increasing From 26 To 32

AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.

  • Author : Latha Suma Date : 11-08-2025 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Government working on changing districts in AP.. Possibility of increasing from 26 to 32..!
Government working on changing districts in AP.. Possibility of increasing from 26 to 32..!

AP : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. ఇందుకోసం ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ  ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘాంలో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి నెలరోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజనలో కొంత గందరగోళంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఈ లోటుపాట్లను సరిచేసే దిశగా కార్యాచరణను ప్రారంభించింది. దీనివల్ల ప్రస్తుతం 26గా ఉన్న జిల్లాల సంఖ్యను 32కి పెంచే అవకాశం ఉంది.

ముఖ్యమైన డిమాండ్లు

ప్రకాశం జిల్లా: పశ్చిమ ప్రాంతం — మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్‌ ఎక్కువైంది. చంద్రబాబు ఈ మేరకు ఎన్నికల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అన్నమయ్య జిల్లా: ప్రస్తుతం రాయచోటి ప్రధాన కేంద్రంగా ఉన్నా, రాజంపేటను జిల్లాకేంద్రంగా చేయాలని స్థానికుల డిమాండ్. దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురాన్ని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం భీమవరం జిల్లా కేంద్రంగా ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తిని స్థానంలో హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా చేసి, జిల్లాకు “సత్యసాయి హిందూపురం జిల్లా” అని పేరు మార్చే అంశం పరిశీలనలో ఉంది.

ప్రతిపాదిత కొత్త జిల్లాలు:

అమరావతి జిల్లా: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు చేర్పు.
మార్కాపురం జిల్లా: మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి.
గూడూరు జిల్లా: గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట.
ఆదోని జిల్లా: ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం.
పలాస జిల్లా: ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం.
మదనపల్లి జిల్లా: మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి.

ఇతర మార్పులు

కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రకాశం జిల్లాకు మళ్లీ అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి చేర్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, పాలనా సౌలభ్యం, ప్రజల సేవల అందుబాటును మెరుగుపరిచే దిశగా జిల్లాల పునర్విభజన జరుగుతోంది. ప్రజల డిమాండ్లు, భౌగోళిక పరిస్తితులు, అభివృద్ధి లక్ష్యాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గ ఉపసమితి త్వరలో మరోసారి సమావేశమై తుది నివేదిక రూపొందించనున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • Cabinet Sub Committee
  • Change of Districts
  • CM Chandrababu
  • Proposal for six new districts

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • Good news from the government for those waiting for pensions.

    Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

Latest News

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

  • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

  • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd