Chandrababu Naidu: ఓటు అందరి బాధ్యత, ఓటుతోనే భవిష్యత్తుకు భద్రత: చంద్రబాబు
ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనుంది.
- By Balu J Published Date - 01:43 PM, Mon - 17 July 23
Chandrababu Naidu: ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు వారి ఓటు హక్కును తెలుసుకునే వెసులుబాటు లభిస్తోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కోరారు.
ఓటు అందరి బాధ్యత అని… ఓటుతో భద్రత లభిస్తుందని… ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఓటు లేకపోతే తక్షణమే అర్హులైనవారందరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో ఎన్నికల అధికారులు చేతులు ఎత్తేసినట్లుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గుంటూరు నగరంలోని పలు ఫేక్ డోర్ నంబర్లతో కొత్త ఓట్లు చేరుతుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది.కొన్ని చోట్ల దొంగ ఓట్లు చేర్చడం మరికొన్ని చోట్ల అసలు ఓట్లు తొలగించడం ఆందోళన కల్గిస్తోంది. ఇదే అంశంపై విపక్ష నేతలు ఆందోళనలు చేసిన ఘటనలున్నాయి. అక్రమపద్ధతుల్లో గెలిచేందుకు అధికార పక్షం కుట్రలు పన్నుతోందంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పలు చోట్ల ఓట్లు మాయం కావడంపై ఈసీ ప్రత్యేక ద్రుష్టి సారించినట్టు కూడా తెలుస్తోంది.
Also Read: Sonia Gandhi Dance: మహిళా రైతులతో సోనియా డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
Related News
Somireddy: అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి: మాజీ మంత్రి సోమిరెడ్డి
Somireddy: దాడులకు పాల్పడుతూ.. అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని లేదంటే జూన్ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల అరాచకాన్ని పారదోలేందుకు ప్రజలు కట్టలు తెంచుకును వచ్చి ఓట్లు వేశారు. దాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు ఫ్రస్ట�