HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >They Crossed The Seven Seas And Voted Chandrababu Praises Nri Tdp Leaders

Chandrababu: సప్తసముద్రాలు దాటొచ్చి ఓటు వేశారు.. ఎన్ఆర్ఐ టీడీపీ నేతలపై చంద్రబాబు ప్రశంసలు జల్లు

  • By Balu J Published Date - 09:16 PM, Wed - 15 May 24
  • daily-hunt
Chandrababu (2)
Chandrababu (2)

Chandrababu: ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుని దాదాపు నెల రోజులుగా ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడం అద్వితీయమని, వారి సేవలు మరవలేనివని కొనియాడారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవి, గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమంలో అధినేత చంద్రబాబునాయుడు జూమ్‌కాల్ ద్వారా పాల్గొని ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా… ఆయనతో సెల్ఫీలు దిగెందుకు పలువురు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపించారు. వెంకట్ కోడూరి, మాలేపాటి సురేష్ తదితరులు ఎన్నికల వేళ తాము నిర్వహించిన విధులు, పోలింగ్ సరళిని చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు మాట్లాడారు.

ఓటుహక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు.. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని, అలా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం దేశవిదేశాల్లోని ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఎన్ఆర్ఐల సమస్యల కోసం పనిచేస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల సంక్షేమంపై దృష్టిపెట్టకపోవడంతో వారిద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా ఆగిపోయాయని, గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు ప్రమాదం బారినపడితే రూ.లక్ష, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు, అక్కడ వారికి ఏదైనా న్యాయ సమస్యలు తలెత్తితే రూ.50 వేల వరకు అందేలా నాడు టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఎపీ ఎన్ఆర్టీ విభాగం కింద టీడీపీ హయాంలో ఇమ్మిగ్రేషన్, ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవారిని స్వదేశాలకు తరలించడంతోపాటు దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించడం కోసం తమ ప్రభుత్వం రెండు శిక్షణ కేంద్రాలు నిర్వహించిందన్నారు.

మన రాష్ట్రం నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి మంచి వేతనం లభించేలా, వారికి శిక్షణ అందించేలా సదరు కేంద్రాలను నడపడం జరిగిందన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం కృషి చేస్తామని, నేరుగా తనను కలిసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీ భవిష్యత్తు కోసమే తాము కుటుంబ సభ్యులతో సహా స్వచ్ఛందంగా ఏపీకి తరలివచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని, స్వయంగా ఓటు వేయడం సంతోషంగా ఉందని పలువురు ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, కూటమి గెలుపు ఏపీకి మలుపు కాబోతుందని పేర్కొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • chandrababu
  • meeting
  • NRI

Related News

Chandrababu Helicopter

CBN New Helicopter – సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్..ప్రత్యేకతలు ఇవే..!

CBN New Helicopter : దీనిలో ఉన్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన భద్రతా ఫీచర్లు, తక్కువ శబ్దం చేయడం దీని ముఖ్య లక్షణాలు. ఇది ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • Vizag Technology Hub Chandr

    Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు

  • Chandrababu Distributes Pen

    Distribution of Pensions : నేడు రాజంపేటలో పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

  • Ap Assembly Sessions

    AP Assembly Sessions : వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd