Missing: తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు మిస్సింగ్..!
తిరుపతి నగరంలో ఐదు మంది విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతుంది.
- By Gopichand Published Date - 03:00 PM, Wed - 9 November 22
తిరుపతి నగరంలో ఐదు మంది విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతుంది. అన్నమయ్య స్కూల్లో పదో తరగతి చదువుతున్న మోహత, మౌనశ్రీ, గునశ్రీ సహా మరో ఇద్దరు బాలురు మిస్ అయ్యారు. ఉదయం 6 గంటలకు స్టడీ అవర్స్ కోసం వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంపై తల్లితండ్రులు ఆందోళన చెందారు. పిల్లల కోసం తలితండ్రులు పలు చోట్ల వెతికారు. పిల్లలు కనిపించకపోవడంతో పిల్లల పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.