HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Father Forced To Take Body Of His Son On Motorcycle When Ambulance Operators Refused

Inhuman Incident: జగన్ పాలన ‘అమానవీయం’

ఏపీలో వరుసగా అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

  • Author : Balu J Date : 26-04-2022 - 12:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirupati
Tirupati

ఏపీలో వరుసగా అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి పై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే, నేడు అంబులెన్స్ దందా కారణంగా మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ. బైక్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతి రుయా ఆస్పత్రి నుండి బాలుడు జాషువ మృతదేహాన్ని తరలించడానికి తండ్రి అంబులెన్స్ కావాలని వేడుకున్నాడు. ఆస్పత్రి యాజమాన్యం కనికరం చూపకపోవడంతో తన సొంత బైక్  పైనే రాజంపేట జిల్లాలోని సొంతూరైన చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించాడు. బైక్ పై కుమారుడి డెడ్ బాడీని తరలిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారుతోంది.

జగన్ మొద్దు నిద్ర వీడాలి

ఈ ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ ను ప్రశ్నించారు. ‘‘అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చేతగాని పాలకుడు YS Jagan Mohan Reddy గారి చెత్త పాలన కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం  పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి’’ అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

నిత్యం ఇబ్బందులే

గత సంవత్సరం మే 10న తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది మరణించడం కూడా ఆస్పత్రి వైఫల్యానికి అద్దం పట్టింది. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవడంతో నిల్వలు తగ్గి తగినంత ప్రెజర్‌తో ఆక్సిజన్ సరఫరా కాకపోవడమే ఘటనకు కారణమని తేల్చింది. కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్యుల కొరత వేధిస్తుండటం, అపరిశుభ్రత లాంటి సమస్యలతో రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లు జరిగితే వెంటనే రుయా ఆసుపత్రికి తరలిస్తారు అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనేక జిల్లాల నుంచి పేద ప్రజలు వైద్యం కోసం రుయా ఆస్పత్రికి వస్తారు కానీ “ఎమర్జెన్సీ వార్డులో పడకల కొరత” కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరుగైన వసతులు కల్పించాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

My heart aches for innocent little Jesava,who died at Tirupati’s RUIA hospital.His father pleaded with authorities to arrange an ambulance which never came.With mortuary vans lying in utter neglect,pvt ambulance providers asked a fortune to take the child home for final rites.1/2 pic.twitter.com/mcW94zrQUt

— N Chandrababu Naidu (@ncbn) April 26, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • ap govt
  • chandrababu naidu
  • Tirupati

Related News

Pulse Polio Programme

నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు

  • Pulse Polio Dec21

    రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd